Monday, January 28, 2013

మృదంగం

మృదంగం దక్షిణ భారతదేశానికి చెందిన ఒక తాళ వాద్యం. శివుని వాహనమైన నంది మృదంగాన్ని వాయిస్తుందని పురాణాలు చెబుతాయి.

ఈ వాద్యం ఒక గొట్టపు ఆకారంలో ఉండి ఇరువైపులా వాయించడానికి అనువుగా ఉంటుంది.

ఇది హిందూసంస్కృతిలో కచేరీలలో ముఖ్యభాగంగా అన్ని కార్య్రకమాల్లోనూ ఉపయోగించే ప్రధాన వాయిద్యం.

మంచి బలమైన చెట్టు కాండం నుంచి పొడవైన భాగాన్ని తీసుకుని దానిలో మధ్యభాగాన్ని తొలగించి డొల్లగా చేస్తారు.

ఎండబెట్టిన తోలును గుండ్రటి రింగులాంటి దానికి చుట్టి బిగిస్తారు. ఆ తోలుకి రింగులు అనుసరిస్తూ చిన్న చిన్న రంధ్రాలు చేస్తారు.

దీన్ని కావలసిన విధంగా చర్మాన్ని వేడి చేసుకుంటూ తాళ్లను బిగించుకుంటూ ధ్వని సరియైన శ్రుతిలో వచ్చేలా సరిచేస్తాడు.

మృదంగవాయిద్యంలో పాల్‌ఘాట్ మణిఅయ్యర్, దండమూడి రామమోహనరావు, యెల్లా వెంకటేశ్వరరావు తదితరులు ఎంతో సుప్రసిద్ధులు.

0 comments:

Post a Comment