
కదిలే చక్రాల్లో లేదా ఇంజన్లో, పిస్టన్
వద్ద చలనంలో ఉన్న రెండు తలాల మధ్య రాపిడి వల్ల ఘర్షణ పుట్టి ఇంజన్
సామర్థ్యం తగ్గే ప్రమాదం ఉంది. దీన్ని నివారించడానికి యంత్రాల కదిలే
భాగాల్లో, వాహనాల ఇంజన్లలో, చక్రాల్లో కందెనగా గ్రీజ్, ఆముదం వంటి నూనెలను
వాడతారు. పిస్టన్ కదులుతున్నప్పుడు ఆ కందెన సన్నని పొరగా ఏర్పడి ఘర్షణని
తగ్గిస్తుంది. దాంతో ఇంజన్ సామర్థ్యం పెరిగి ఎక్కువకాలం పనిచేయగలదు.
0 comments:
Post a Comment