Tuesday, February 26, 2013

చక్రవాకం, మలయమారుతం, కళావతి

చక్రవాకం, మలయమారుతం, కళావతి రాగాల ఆధారంగా ఉన్న కొన్ని పాటలు

చక్రవాకం
1. ఏడు కొండలవాడ వెంకటా రమణా… (పెళ్ళిచేసి చూడు)
2. విధివంచితులై విభవము వీడి… (పాండవ వనవాసం)
3. చీకటిలో కారుచీకటిలో… (మనుషులు మారాలి)
4. రాధకు నీవేర ప్రాణం… (తులాభారం)
5. వీణలోనా తీగలోనా… (చక్రవాకం)
6. జగమే రామమయం… (కధానాయకి మొల్ల)
7. నీ కొండకు నీవే రప్పించుకో… (ఘంటసాల ప్రైవేట్‌ రికార్డ్‌)
8. పిబరే రామరసం… (బాలమురళి ప్రవేట్‌ రికార్డ్‌)
9. పిలిచే వారుంటే … (కల్యాణ మండపం)
10. స్వరములు ఏడైన… (రాగమాలికలోని ఒకచరణం)
11. పూఛొన కైసె మైనె రైన్‌బితాయె… (మేరీ సూరత్‌ తేరీ ఆంఖే)


మలయమారుతం
12. ఓ మలయ పవనమా… (మానవతి)
13. కొండగాలి తిరిగింది… (ఉయ్యాల జంపాల)
14. మనసా ఎటులోర్తునే… (త్యాగరాజ కృతి)
15. మేలుకో శ్రీరంగా… (విప్రనారాయణ రాగమాలికలోని ఒక చరణం)


కళావతి
16. కరుణామయా దేవా… (భక్త తుకారాం)
17. మా ఇలవేలుపు నీవేనయ్యా… (మా వదిన)
18. తోటలోకి రాకురా తుంటరి తుమ్మెదా… (బుద్ధిమంతుడు)
19. వెన్నెల రేయి ఎంతో చలీ చలీ… (ప్రేమించిచూడు)
20. వసంతగాలికి… (కర్ణ?)


రాగం “చక్రవాకం”, కర్ణాటక సాంప్రదాయ సంగీతంలోని 16వ మేళకర్త. హిందూస్తానీ సంగీతంలో “చక్రవాకం”రాగానికి దగ్గర రాగం “అహిర్‌ భైరవి”. కరుణ, భక్తి రసాలను ఈ రాగాలు బాగా పోషిస్తాయి. ముఖ్యంగా, పైన చెప్పిన సినిమా పాటలు పరిచయం ఉన్న వారికి ఈ విషయం అనుభవమే! “చక్రవాకం”, “అహిర్‌ భైరవి” రాగాల స్వర స్థానాల గురించి, “మలయ మారుతం”, “కళావతి” రాగాల స్వరస్థానాలు చర్చించినపుడు తెలుసుకుందాం!

“మలయ మారుతం” కర్ణాటక సాంప్రదాయ సంగీతంలోని 16వ మేళ కర్త అయిన “చక్రవాకం” రాగం యొక్క జన్యం. హిందుస్తానీ పద్ధతిలో “మలయ మారుతం” అన్న పేరుగల రాగం కానీ, “మలయ మారుతం” రాగాన్ని పోలిన రాగం కానీ లేవు. ఐతే, ముఖ్యంగా వాయిద్యకారులు గత 50, 60 సంవత్సరాలుగా, “మలయ మారుతం” రాగాన్ని యధాతధంగా హిందూస్తానీ పద్ధతిలోకి ప్రవేశపెట్టారు. “మలయ మారుతం” ఉదయాన్నే పాడుకొనే ఆహ్లాదకరమైన రాగం. కర్ణాటక సాంప్రదాయ సంగీతంలోని “మనసా ఎటులోర్తునే..” అన్న చాలా ప్రసిద్ధ త్యాగరాజ కృతి, స్వరపరచబడింది “మలయ మారుతం” రాగంలోనే!కరుణ రసాన్ని ఎంతో చక్కగా పోషించే “మలయ మారుతం” రాగం మనో ధర్మ సంగీత అంశాలైన రాగాలాపన, స్వరకల్పన లకు ప్రసిద్ధమైంది.

కళావతి” రాగం హిందూస్తానీ సాంప్రదాయానికి సంబంధించింది. కర్ణాటక సాంప్రదాయ సంగీతంలో “కళావతి” అన్న రాగం ఉన్నా, ఈ రెంటికీ పోలికలు లేవు. పైన చెప్పుకున్న 16వ మేళకర్త “చక్రవాకం” యొక్క జన్య రాగం అయిన “వలజి” అన్న రాగం హిందూస్తానీ సంగీతంలోని “కళావతి”ని కొంతవరకు పోలి ఉంటుంది. ఈ రెంటికీ స్వరస్థానాలు ఒకటే. అయితే, ఈ రెండు రాగాలు ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయని చెప్పలేము. “కళావతి” రాగాన్ని అర్ధరాత్రికి ముందు సమయంలో పాడతారు. పైన ఇచ్చిన కొన్ని సినిమా పాటలలో, ఈ రాగాన్ని అందుకనే వాడారు. ఉదాహరణకు, “వెన్నెల రేయి ఎంతో చలీ చలీ…”, “వసంత గాలికి వలపులు రేగ…” వంటి పాటల్లో, సాహిత్యానికి తగ్గట్టే “కళావతి” రాగం వాడారు.

స్వరస్థానాలు పరిచయం
“చక్రవాకం” సంపూర్ణ రాగం. ఆరోహణలోనూ అవరోహణలోనూ ఏడు స్వరాలు ఉపయోగించే రాగం. కీబోర్డ్‌ మీద పలికిస్తే, స్వర స్థానాలు ఈ విధంగా ఉంటాయి.
స రి1 X X గ2 మ1 X ప X ద2 ని1 X స
ఆరోహణ సరిగమపదనిసా
అవరోహణ సానిదపమగరిస
X అన్న చోట ఉన్న స్వరాలను వాడరు.
హిందూస్తానీ సంగీతంలోని “అహిర్‌ భైరవి” రాగం, మన “చక్రవాకం” రాగాన్ని పోలి ఉంటుంది. అరోహణ అవరోహణ స్వరాలు కూడా “చక్రవాకం” రాగం లాగే ఉంటాయి. ఐతే, రాగం యొక్క ఆలాపనలోనూ, రాగానికి ఇచ్చే ట్రీట్‌మెంట్‌ లోనూ కర్ణాటక హిందూస్తానీ సంగీతాల్లో ఉన్న తేడా ఎలా ఉంటుందో, “చక్రవాకం”, “అహిర్‌ భైరవి” రాగాల్లో స్పష్టంగా కనపడుతుంది.

“మలయ మారుతం” షౌడవ రాగం. ఆరోహణ అవరోహణ, రెంటిలోనూ ఆరు స్వరాలు మాత్రమే ఉంటాయి. “చక్రవాకం” రాగంలోని మధ్యమ స్వరాన్ని (”మ”) పూర్తిగా వదిలేస్తే, అది “మలయ మారుతం” అవుతుంది. కీబోర్డ్‌ మీద స్వర స్థానాలు ఇలా ఉంటాయి.
స రి1 X X గ2 X X ప X ద2 ని1 X స
ఆరోహణ సరిగపదనిసా
అవరోహణ సానిదపగరిస
X అన్న చోట ఉన్న స్వరాలను వాడరు.
“గ, ని” స్వరాలను “ఛాయా స్వరాలు” అంటారు. రాగ లక్షణాన్ని చూపిస్తున్నప్పుడు, “ధ” స్వరం మీద ఎక్కువగా ఆపుతూ ఉంటారు. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు, “మలయ మారుతం” రాగాన్ని పోలిన హిందూస్తానీ రాగం లేదు.

“కళావతి” ఔడవ రాగం. ఆరోహణ అవరోహణ, రెంటిలోనూ ఐదు స్వరాలు మాత్రమే ఉంటాయి. “మలయ మారుతం” రాగంలోని రిషభం స్వరాన్ని (”రి”) పూర్తిగా వదిలేస్తే, అది “కళావతి” రాగం అవుతుంది. కీబోర్డ్‌ మీద స్వర స్థానాలు ఇలా ఉంటాయి.
స X X X గ2 X X ప X ద2 ని1 X స
ఆరోహణ సగపదనిసా
అవరోహణ సానిదపగస
X అన్న చోట ఉన్న స్వరాలను వాడరు.

“మలయ మారుతం” రాగంలోని రిషభాన్ని తియ్యటం వల్ల ఐదు స్వరాలే ఉన్నా, ఈ రాగానికి తనదైన ఒక ప్రత్యేకత ఉంది. లలిత సంగీతంలో “కళావతి” రాగాన్ని వాడటం గత 50, 60 సంవత్సరాలుగా జరుగుతోంది.

సినిమా పాటల్లోకి దూకే ముందు, ఈ మూడు రాగాలకి ఉన్న సంబంధాలని చూద్దాం! స్వరస్థానాల దృష్య్టా చెప్పాలంటే, “మలయమారుతం” రాగం “చక్రవాకం” రాగంలో ఒక భాగం. అలాగే, “కళావతి” రాగం “మలయ మారుతం” రాగంలో ఒక భాగం అనుకోవచ్చు. అక్కడితో ఈ పోలికలు, సంబంధాలు పూర్తి అయినట్లే! రాగ లక్షణం దృష్య్టా, ఈ మూడు రాగాలకి దేని గొప్పతనం, ప్రత్యేకత దానికే ఉన్నాయి.

సినిమా పాటలు
“చక్రవాకం” రాగానికి సినిమా పాటల్లో ఒక మంచి ఉదాహరణ “పెళ్ళిచేసి చూడు” సినిమాలోని “ఏడుకొండలవాడ వెంకటా రమణా..” అన్న పాట. జంపె తాళంలో నడిచే ఈ పాట కంపోజ్‌ చెయ్యటంలో ఘంటసాల, పాడటం లో శ్రీమతి లీల చూపించిన విద్వత్తు వాళ్ళు సినీ సంగీతంలో ఎలా ఉన్నత స్థానాల్ని సంపాదించుకున్నారో నిరూపిస్తాయి. పైన చెప్పిన ఇతర సినిమా పాటల్లో ఎక్కువగా”అహిర్‌ భైరవి” రాగం ఛాయలు కనిపిస్తాయి. ఉదాహరణకి, “రాధకు నీవేర ప్రాణం…” అన్న పాప్యులర్‌ పాటలో, శ్రీమతి సుశీల పాట ముందు ఆలాపన ద్వారా “అహిర్‌ భైరవి” ఛాయలు మనకి చూపించారు. అలాగే “తేరీ సూరత్‌ మేరీ ఆంఖే” అన్న హిందీ సినిమాలో “పూఛోన కైసే మైనే…” అన్న పాట సినిమాలో రెండు, మూడు చోట్ల కరుణ రసాన్ని పోషిస్తూ వినిపిస్తుంది. ఉత్సాహం ఉన్న వాళ్ళు, ఈ సినిమా మళ్ళీ చూసినపుడు, మన్నాడే పాడిన ఆలాపన, స్వరోచ్ఛారణ బాగా గుర్తు పెట్టుకో తగ్గవి.

ఇంకో ఉదాహరణ. “స్వరములు ఏడైనా రాగాలెన్నో….” అన్న శ్రీమతి సుశీల పాడిన రాగమాలిక (పంతువరాళి, చక్రవాకం, హిందోళం, సింధుభైరవి) లో, “జననంలోనా కలదు వేదనా, మరణంలోనా కలదు వేదనా” అని మొదలయ్యే చరణంలోని సాహిత్యానికి, సంగీతం ఇచ్చింది “చక్రవాకం” రాగంలోనే!

“లలిత సంగీతంలో కూడా మలయమారుతం వంటి రాగాలను వాడచ్చు” అని ప్రముఖ వాగ్గేయకారుడు శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు (”రజని”), “ఓ మలయ పవనమా…” అన్న పాట ద్వారా “మానవతి” అన్న పాత సినిమాలో నిరూపిస్తే, “ఉయ్యాల జంపాల” సినిమా ద్వారా, “కొండగాలి తిరిగింది…” అన్న పాటని “మలయ మారుతం” రాగంలో కంపోజ్‌ చేసి, ప్రతి తెలుగు వ్యక్తి నాలుకపైన పలికేట్లు చేసిన నేర్పు, గొప్పతనం, స్వర్గీయ పెండ్యాల నాగేశ్వరరావు గారివి. ఇప్పుడు చెప్పుకున్న ఉదాహరణల్లో, సాహిత్య పరంగా “మలయ పవనము”, “కొండగాలి” వంటి పదాలతో మొదలయ్యే పాటలకి “మలయ మారుతం” రాగాన్ని వాడటం ఎంత సహజంగా ఉందో మీరు గమనించే ఉంటారు. పైన లిస్ట్‌ చూస్తే, “మలయ మారుతం” రాగం, తెలుగు సినిమా పాటల్లో తక్కువే అనిపిస్తుంది అడపా, తడపా రాగమాలికల్లో ఈ రాగాన్ని వాడుకున్నా!

మాష్టర్‌ వేణు కంపోజ్‌చెయ్యగా, ప్రముఖ సినీ గాయకుడు శ్రీ పి. బి. శ్రీనివాస్‌ , సుశీలతో కలిసి పాడిన యుగళ గీతం “వెన్నెల రేయి ఎంతో చలీ చలీ..” పాట చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఈ పాటలో “కళావతి” రాగంలో వాడకూడని “తీవ్ర రిషభం” వాడటం జరిగింది. సినిమా పాటల్లో ఇది మామూలే! ముఖ్యంగా గుర్తు పెట్టుకోవల్సింది పి. బి. శ్రీనివాస్‌ “చూపులతోనే మురిపించేవూ… మాటలతోనే మరపించేవూ…” అన్నప్పుడు ఈ పదాల చివర వచ్చే గమకాలు అద్భుతంగా పాడటం. లలిత సంగీతంలో వచ్చే ఒకచిక్కు ఏమిటంటే, శాస్త్రీయ సంగీతంలో అన్నట్టుగానే స్వరాలన్నీ పలకాలి, అంతే కాకుండా ఆ స్వరాలన్నిటిని లలితంగా కూడా పాడాలి! శ్రీ శ్రీనివాస్‌ ఈ పాటలో అది స్పష్టంగా వినిపించారు. ప్రముఖ సంగీత దర్శకుడు, శ్రీ కె.వి. మహాదేవన్‌ ట్యూన్‌ చేసిన “తోటలోకి రాకురా తుంటరి తుమ్మెదా..” అన్న “బుద్ధిమంతుడు” సినిమాలోని పాట కూడా “కళావతి” రాగంలో బాణీ కట్టిందే! కానీ, ఈ పాటలో “కోమల మధ్యమం”, “తీవ్ర రిషభం” కూడా వాడారు. అందువల్ల పాటకు ఏమీ నష్టం కలగలా! ఒక రకంగా చూస్తే ఈ పాటలో వాడిన రాగాన్ని “మిశ్ర కళావతి” అనొచ్చు.
ప్రతి వ్యాసం చివర, ఆ వ్యాసంలో పరిచయం చెయ్యబడ్డ రాగంకి సంబంధించిన సినిమా పాటల పూర్తి స్వరాలు ఇస్తున్నట్టే, ఈ వ్యాసంలో కూడా ఇస్తున్నాను. “చక్రవాకం” కోసం “ఏడుకొండలవాడ వెంకటా రమణా…”, “మలయ మారుతం” కోసం “కొండగాలి తిరిగింది…”, “కళావతి” కోసం “వసంతగాలికి” అన్న పాటల స్వరాలు ఇస్తున్నాను. స్వరాలను అర్ధం చేసుకోటానికి కొత్తగా ప్రయత్నించే వారు, ఈ పాటలు ఒరిజినల్‌ రికార్డ్‌ మళ్ళీ వింటే, ఈ స్వరాలు కొంచెం తేలికగా అర్ధమవుతాయి.

“ఏడుకొండలవాడ …” స్వరాలు
Opening సా, రిగమ, సా, నిదని, సా, రిగమ, పా, దనిస, దా,
దని, సరిగ, సా, నిసనిప, దానిసా, దనిదమ, పాదానీ
పదనీ, దపమగరీ, గామా, పా, గరిసా

ఏడుకొండలవాడ వెంకటారమణా
సద్దుసేయక నీవు నిదురపోవయ్యా

గమపా, రిగమారి, సా, రిగపమా

మొదటి చరణం
పాలసంద్రపుటలలు పట్టెమంచముగా
పున్నమి వెన్నెలలు పూలపానుపుగా
కనులనొలికే వలపు పన్నీటి జల్లుగా
అన్ని అమరించె నీ అలిమేలుమంగా… “ఏడు కొండలవాడ”

గమపా, రిగమారి, సా, రిగమ, పా, దనిస, దా
దని, సరిగ, సా, నిసనిప, దానిసా, దనిదమ, పాదానీ
పదనీ, దపమగరీ, గామా, పా, గరిసా


రెండవ చరణం
నాపాలి దైవమని నమ్ముకున్నానయ్య
నా భాగ్యదేవతా నను మరువకయ్యా
బీబి నాంచారమ్మ పొంచి ఉన్నాదయ్య
చాటు చేసుకు ఎటులో చెంతజేరెదనయ్య… “ఏడు కొండలవాడ”



“కొండగాలి తిరిగింది …” స్వరాలు
కొండగాలి తిరిగిందీ…. సాని ద పదపదసా
కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది
గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది ఆ … పదగరిసా ..
సారిగపా..

పాదానీసా రిగరిగరిగరిసా రిగరిగరిగరిసా … పా
నినిని సనిద దదద నిదప పదనీ దనిసా సానిదపా

పుట్టమీద పాలపిట్ట పొంగిపోయి కులికింది
గట్టుమీద కన్నెలేడి గంతులేసి ఆడింది

నినినిససా రిసరిససా నినినిససా రిసరిససా
పట్టపగలు సిరివెన్నెల భరత నాట్య మాడింది
పట్టరాని లేత వలపు పరవశించి పాడింది… “కొండగాలి తిరిగింది”

పాదానీసా రిగరిగరిగరిసా రిగరిగరిగరిసా … పా
నినిని సనిద దదద నిదప పదనీ దనిసా సానిదపా

మొగలిపూల వాసనతో జగతి మురిసి పోయిందీ….
నాగమల్లి పూలతో నల్లని జడ నవ్వింది

నినినిససా రిసరిససా నినినిససా రిసరిససా
పడుచుదనం అందానికి తాంబూల మిచ్చిందీ…..
ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది… “కొండగాలి తిరిగింది”


 “వసంత గాలికి …” స్వరాలు
Opening ఆలాపన …
Flute: పసా.. నిసనిసనిసద దనిదనిదనిదప పదపదపదపగ
నిసదపగరిస
Guitar: గా.. పా.. దా..

వసంతగాలికి వలపులు రేగ వరించు బాలిక మయూరి కాగా
తనువు మనసు ఊగితూగి ఒక మైకం కలిగేనులే… ఈ మహిమ నీదేనులే
ప్రేమతీరు ఇంతేనులే, ఈ మహిమ నీదేనులే

Guitar: సని దప గరి నిని సా
Accordian: దగప దసనిదా దగపదనీ నిదపా నిదపా
Flute: పా.. దా.. ని.. రిగా పా రి సా ససారీస నినీదాద దదానీని
పాపా
Voilin: సా నిదప దపగరిసా
Guitar: గపదా

రవంత సోకిన చల్లని గాలికి (పదపగరిస) మరింత సోలిన
వసంతుడనగా
తనువు మనసు, ఊగి తూగి ఈ లోకం మారేనులే… ఈ మహిమ నీదేనులే
ఆహా.. భలే హాయిలే… ఈ మహిమ నీదేనులే “వసంత గాలికి”

Guitar: సని దప గరి నిని సా
Accordian: దగప దసనిదా దగపదనీ నిదపా నిదపా
Flute: పా.. దా.. ని.. రిగా పా రి సా ససారీస నినీదాద దదానీని
పాపా
Voilin: సా నిదప దపగరిసా
Guitar: గపదా

విలాస మాధురి, వెన్నెల కాగా
విహార వీణలు విందులు కాగా
ఏకాంతంలో నీవూ నేనే
ఒక స్వర్గం కనిపించెలే
ఈ మహిమ నీదేనులే.. ప్రేమ తీరు ఇంతేనులే .. ఈ మహిమ నీదేనులే
“వసంత గాలికి”

హిందోళ రాగం

(ఇంతకు ముందు వ్యాసాల్లో పరిచయం చేసిన మోహనం, అభేరి, సింధుభైరవి, కల్యాణి రాగాల్లాగే, హిందోళం రాగం కూడా చాలా ప్రసిద్ధమైన రాగం. రాగలహరి శీర్షికలో రాగాలను పరిచయం చేస్తున్నప్పుడు “ఏ రాగాలను పరిచయం చెయ్యాలి?” అన్న ప్రశ్న సహజంగానే వచ్చింది. ఈ రాగాలను ఎన్నుకోటంలో రెండు నియమాలు పాటించటం జరిగింది. మొదటిది జనసామాన్యానికి బాగా పరిచయమైన రాగం కావటం ఒకటి. ఎన్నుకున్న రాగంలో వీలైనన్ని సినిమా పాటలు ఉండటం మరొకటి. ఇప్పటి వరకు పరిచయం చెయ్యబడ్డ రాగాలు ఈ కోవకి చెందినవే! ఇప్పుడు పరిచయం చెయ్యబోతున్న హిందోళం రాగం ఐదో రాగం. ఐదు స్వరాలున్న హిందోళం రాగం, ఐదో రాగంగా పరిచయం చెయ్యడం కేవలం యాధృచ్ఛికమే!)

హిందోళం రాగం ఆధారంగా ఉన్న కొన్ని పాటలు
1. సందేహించకుమమ్మా… (లవకుశ)
2. కలనైనా నీ తలపే… (శాంతినివాసం)
3. నారాయణా హరి నారాయణా… (చెంచులక్ష్మి)
4. పగలే వెన్నెలా… (పూజాఫలం)
5. నేనే రాధనోయీ… (అంతా మన మంచికే)
6.పిలువకురా అలుగకురా… (సువర్ణ సుందరి)
7. మోహనరూపా గోపాలా… (కృష్ణ ప్రేమ?)
8. వీణ వేణువైన సరిగమ… (ఇంటింటి రామాయణం)
9. చూడుమదే చెలియా … (విప్రనారాయణ)
10. సామజవర గమనా… (శంకరాభరణం)
11. రాజశేఖరా నీపై… (అనార్కలి)
12. అందమె ఆనందం… (బ్రతుకు తెరువు)
13. శ్రీకర కరుణాలవాల… (బొబ్బిలి యుద్ధం)
14. రామ కధను వినరయ్యా… (లవకుశ)
15. మనసే అందాల బృందావనం… (మంచి కుటుంబం)
16. సాగర సంగమమే ప్రణయ… (సీతాకోక చిలుక)
17. కొండలలో నెలకొన్న కోనేటి… (అన్నమాచార్యుని కీర్తన)
18. ఓం నమశ్శివాయ… (సాగర సంగమం)
19. ఆధాహై చంద్రమా… (నవ్‌రంగ్‌)
20. భావోద్యానమునందు… (కరుణశ్రీ పద్యం ఘంటసాల)
21. మన్‌ తడపత్‌… (బైజు బావరా)
22. భజరే గోపాలం (సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన)

పంచస్వర రాగాలలో హిందోళం చాలా రక్తి కట్టించే రాగం. సప్తస్వరాలలోని “ప”, “రి” స్వరాలు హిందోళంలో లేవు!ఇంతకుముందు చెప్పుకున్న మోహనం రాగంలాగే, హిందోళం కూడా ఐదు స్వరాలున్న జనరంజకమైన ప్రసిద్ధ రాగం. అన్నీ కోమల స్వరాలే అవడం వల్ల, చాలా రుచిగా, తీయగా ఉండే రాగం. మనోధర్మ సంగీతం పాడటానికి అనుకూలమైన రాగం హిందోళం. ఈ రాగం అన్నివేళలా పాడవచ్చు. కచ్చేరీలలో ఈ రాగాన్ని ముఖ్యమైన రాగంగా తీసుకొని చాలాసేపు పాడవచ్చు. నిర్దిష్టమైన రూపంకలిగిన హిందోళం రాగం కరుణ, భక్తి, శృంగార రసాలను పోషింపగలదు.
8వ మేళకర్త అయిన హనుమత్తోడి జన్యరాగం హిందోళం. ఈ రాగంలో ప్రసిద్ధ రచనలు సామజవర గమనా (త్యాగరాజు), మనసులోని మర్మము (త్యాగరాజు), నీరజాక్షి కామాక్షి (ముత్తుస్వామి దీక్షితార్‌), భజరే గోపాలం (సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన).

స్వరస్థానాలు పరిచయం
ఇంతకు ముందు చెప్పినట్లు హిందోళం, ఔడవ రాగం. అంటే, ఆరోహణలోనూ అవరోహణలోనూ కూడా ఐదు స్వరాలే ఉంటాయి.
స X X గ1 X మ1 X X ద1 X ని1 X స
ఆరోహణ సగమదనిసా
అవరోహణ సానిదమగస

హిందూస్తానీ సంగీతంలో…

హిందూస్తానీ సంగీతంలోని “మాల్‌కోన్స్‌” రాగం మన కర్ణాటక సంగీత సాంప్రదాయంలోని హిందోళం రాగానికి సమానం. స్వరస్థానాల్లో హిందోళానికి, మాల్‌కోన్స్‌కి తేడాలు ఏమీ లేవు. నిజానికి, ఈ రెండు రాగాల్లో ఒకటి తెలిస్తే, రెండవ రాగాన్ని పోల్చుకోటం చాలా సులువు. మాల్‌కోన్స్‌ రాగం చాలా ప్రాచుర్యం పొందిన పాత రాగం. అతి మధురంగా ఉండే రాగాల్లో ఈ రాగం ముఖ్యమైనది. ఆరోహణ అవరోహణ స్వరాలు పైన చెప్పినట్లు కర్ణాటక పద్ధతిలో ఉన్నట్టుగానే ఉంటాయి. మాల్‌కోన్స్‌ రాగం పకడ్‌ ఇలా ఉంటుంది.
స మగ ధనిధమ గస
మాల్‌కోన్స్‌ రాగానికి వాది స్వరం “మ”, సంవాది స్వరం ” స”.

హిందూస్తానీ సంగీతంలో ఆందోళన స్వరాలని కొన్ని ఉంటాయి. అంటే, ఈ స్వరాలు పలుకుతున్నప్పుడు కాని, వాయిద్యాలపై పలికిస్తున్నపుడు కాని ఈ స్వర స్థానాల్లో “కంపనం” ఎక్కువగా చేస్తారు. సైన్సు భాషలో చెప్పాలంటే, ఆందోళన స్వరాల frequency కి అతిదగ్గరగా ఉండే ఇతర frequency లను కూడా పలకటం లేదా పలికించటం జరుగుతుంది. ఈ frequncy మార్పులు మరీ ఎక్కువైతే, పక్క స్వరంలోకి వెళ్ళిపోతాము. అలా కాకుండా, చాలా subtle గా ఉండేట్లుగా స్వరాన్ని కంపించేట్లుగా చెయ్యాలి. ఈ ఆందోళన స్వరాలనే మన కర్ణాటక సాంప్రదాయ సంగీతంలో “కంపిత” స్వరాలంటారు. మాల్‌కోన్స్‌లో గాని హిందోళంలో గాని “గ, ని, ధ” స్వరాలను ఆందోళన లేదా కంపిత స్వరాలంటారు. స్వరం “మ” ఆందోళన / కంపిత స్వరం కాదు. కంపించకుండా వదిలేసినపుడు, “మ” స్వరం ఠీవిగా ఉంటుంది. హిందోళం రాగంలా కాకుండా, మాల్‌కోన్స్‌ను రాత్రి 9 గంటలనుంచి అర్ధరాత్రి దాకా పాడతారు.

సినిమా పాటలు
హిందోళం లేక మాల్‌కోన్స్‌ రాగాల్లో సినిమా పాటలు బోలెడు వినిపిస్తాయి. “లవకుశ” (1963) సినిమా రిలీజ్‌ అయిన సెంటర్స్‌ అన్నిట్లోనూ 100 రోజులు ఆడిన మొదటి తెలుగు సినిమా అన్న విషయం సినిమా ప్రియులకు తెలిసిందే! ఈ సినిమా విజయానికి ఒక కారణం ఈ సినిమాలోని అన్ని పాటలూ, పద్యాలూ జనాదరణ పొందటమే! ఈ సినిమాలో హిందోళం రాగంలో ఘంటసాల కంపోజ్‌ చేసి పాడిన “సందేహించకుమమ్మా..” అన్న పాట చెప్పుకోతగ్గది. శుద్ధ హిందోళంలో వినిపించకూడని “పంచమం”, “రిషభం” స్వరాలను (ప, రి) ను చాలా గమ్మత్తుగా వాడుతూ, హిందోళం రాగం మూడ్‌ మార్చకుండా వాడుకున్న ఘంటసాలను మెచ్చుకుతీరాలి. ఇదే సినిమాలో “రామకధను వినరయ్యా..” అన్నపాట కూడా హిందోళంలో స్వరపరచిందే.ఆ నాటి ప్రముఖ గాయకులైన లీలసుశీల ల గొంతులను ఘంటసాల ఈ సినిమాలో ఉపయోగించినట్లు మరేసినిమాలోనూ ఏ సంగీతదర్శకుడూ ఉపయోగించలేదు. అలాగే ఘంటసాల సంగీత దర్శకత్వం చేసిన “గుండమ్మ కధ” సినిమాలో, ఎల్‌. విజయలక్ష్మి solo డాన్స్‌ చూపిస్తున్నప్పుడు నేపధ్య సంగీతంలో నాదస్వరం ద్వారా వినిపించే సంగీతం హిందోళంలో ట్యూన్‌ చెయ్యబడ్డదే! మనకి నాదస్వరంలాగే, ఉత్తర భారత దేశంలో చాలా పాప్యులర్‌ అయిన బిస్మిల్లాఖాన్‌ “షెహనాయి”లో మాల్‌కోన్స్‌లో ఉన్న బాణీ చాలా మంది సంగీత ప్రియులకు పరిచితమే!

సినిమా మాత్రమే కాకుండా పాటల ద్వారా కూడా పాప్యులర్‌ అయిన “శంకరాభరణం” సినిమా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో “సామజవర గమన” అన్న పాట హిందోళం రాగంలో కూర్చబడిందన్న విషయం సినిమాలోనే చెప్పబడింది. ఐతే, ఈ పాట చివర్లో ఆలాపన పూర్తికాకుండానే పాటను ఆపేయటం జరుగుతుంది. “శుద్ధ హిందోళంలో రిషభం ఎలా వచ్చింది?” అన్న ప్రశ్న వస్తుంది. సినిమా కధకోసం కావాలనే హిందోళంలో అపస్వరమైన “రిషభం” స్వరం పాట చివరి ఆలాపనలో వాడబడటం నిజంగానే జరిగిందన్న విషయం, ఈ రాగంతోటీ, స్వరాలతోటీ పరిచయమున్న పాఠకులకు తెలిసే ఉంటుంది!

రహస్యం (1967) సినిమాలో ఘంటసాల సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకున్న “గిరిజా కల్యాణం” అనే యక్షగానం చాలా పాప్యులర్‌ అయింది. ఇందులో అనేక రాగాలు ఉపయోగించుకున్న ఘంటసాల (యక్షగాన రచయిత శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి సూచనమేరకు) “సామగ సాగమ” సాకారా (ఉమాబాల ధ్యాన నిష్ఠలో ఉన్న సదాశివుని సేవించే విధం) అనే అక్షరాలకు హిందోళం రాగంలో అవే స్వరస్థానాలు ఇవ్వటం గమనించతగ్గది.

తెలుగు సినిమాలకి సంగీతం ఇచ్చిన కన్నడ సంగీత దర్శకుల్లో రాజన్‌నాగేంద్ర జంట చెప్పుకోతగ్గది. “ఇంటింటి రామాయణం” అన్న సినిమా కోసం హిందోళంలో స్వరం ఇచ్చిన “వీణ వేణువైన సరిగమ” అన్న పాట ఒక మంచి పాట. ఈ పాటలో శుద్ధ హిందోళంలో వాడకూడని అంతర గాంధారం (తీవ్ర గాంధారం లేక గ2) వాడటం జరిగింది. అంటే, హిందోళంలో ఉన్న గ1 కాక గ2 కూడా వాడారు. ఐతే, ఈ రెండు గాంధారాలు వాడటం కొంత వింతగా ఉంటుంది. “వీణ (మామ) వేణు (గా2గ2) వైన (గా1గ1)” వంటి వాడకం జరిగింది. “వేణు వైన” అన్నప్పుడు “వేణు” లోని గ2 స్వరం నుంచి “వైన” అన్నపుడు వాడిన గ1 స్వరంలోకి glide అవుతుందన్నమాట. ఇలాంటి ప్రయోగాలు సంగీత దర్శకులకి కొత్త కాదు కానీ, హిందోళం రాగం ప్రసక్తి వచ్చింది కాబట్టి ఈ ఉదాహరణ సందర్భానికి తగ్గట్టే ఉంది.

హిందీ సినిమాల్లో కూడా మాల్‌కోన్స్‌ చాలా ఎక్కువగా వాడారు. ఉదాహరణకి, మహమ్మద్‌ రఫీ “బైజు బావరా” సినిమా కోసం పాడిన “మన్‌ తడపత్‌” అన్నది ఒక గొప్ప పాట. ఈ పాట వింటూంటే, తెలుగు సినిమాలలో హిందోళంలో కంపోజ్‌ చేసిన తెలుగు పాటలు చాలా గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా ఈ పాటలో రఫీ గొంతు, పాట ద్వారా పోషింపబడిన భక్తి రసం, అన్నిటికంటే ఎక్కువగా గుర్తు పట్టుకోవలసిన నౌషాద్‌ సంగీత దర్శకత్వం మరపు రానివి.

సినిమా పాటల ప్రసక్తి వచ్చినపుడు, (ర)సాలూరు రాజేస్వరరావు పేరు చెప్పకపోతే ఈ వ్యాసానికి సంపూర్ణత ఉండదు. అందుకనే, శ్రీ సాలూరు వారు “పూజా ఫలం” సినిమాకి కంపోజ్‌ చేసిన అన్ని గొప్ప పాటలలో, హిందోళంలో బాణీ కట్టి, శ్రీమతి ఎస్‌.జానకిచే పాడించిన ఈ క్రింది పాట స్వరాలతో ఈ వ్యాసం ముగిస్తున్నాను. ఉత్సాహం ఉన్న వాళ్ళు, ఒక చరణానికి మరొక చరణానికి మధ్యలోనూ చరణం మధ్యలోనూ వచ్చే స్వరాలు ప్రాక్టీస్‌ చెయ్యతగినవి.

“పగలే వెన్నెలా …” స్వరాలు
Opening ఆలాపన
పగలే వెన్నెలా జగమే ఊయలా
కదిలే ఊహలకే కన్నులుంటే …
Flute సానిదసా నిదమా నీదమనీ దమగా
Piano సమమగస మదదదమ దనినినిద నీసా

మొదటి చరణం
నింగిలోన చందమామ తొంగిచూచె (నీసాదనీ)
నీటిలోన కలువభామ పొంగిపూచె
ఈ అనురాగమే జీవన రాగమై (దనిసగ సమగమస)
ఎదలో తేనెజల్లు కురిసిపోదా “పగలే వెన్నెలా…”
Flute సానిదసా నిదమా నీదమనీ దమగా
Piano సమగస మదదదమ దనినినిద నీసా

రెండవ చరణం
కడలి పిలువ కన్నెవాగు పరుగు తీసె (నీసాదనీ)
మురళి పాట విన్న నాగు శిరసునూపె
నినిసస నినిసస దదనిని మమదదనిని దదనినిసా
ఈ అనుబంధమే మధురానందమై (దనిసగ సమగమస)
ఇలపై నందనాలు నిలిచిపోగా “పగలే వెన్నెలా…”
Flute సానిదసా నిదమా నీదమనీ దమగా
Piano సమగస మదదదమ దనినినిద నీసా

మూడవ చరణం
నీలి మబ్బు నీడ చూచి నెమలి ఆడె
పూల ఋతువు సైగ చూసి పికము పాడె
దనిసగసని దనిసగసని దనిసగసనిసా
మనసే వీణగా ఝణఝణ మ్రోయగా
బ్రతుకే పున్నమిగా విరిసి పోదా “పగలే వెన్నెలా…”

కల్యాణి రాగం

కల్యాణి రాగం ఆధారంగా ఉన్న కొన్ని పాటలు
1. జగమే మారినది మధురముగా ఈ వేళ… (దేశద్రోహులు)
2. తలనిండ పూదండ దాల్చిన రాణి… (ఘంటసాల ప్రైవేటు రికార్డ్‌)
3. మనసున మల్లెల మాలలూగెనే… (మల్లీశ్వరి)
4. మది శారదాదేవి మందిరమే… (జయభేరి)
5. పెనుచీకటాయే లోకం… (మాంగల్య బలం)
6.జోరుమీదున్నావు తుమ్మెదా … (శివరంజని)
7. పాడనావాణి కల్యాణిగా… (మేఘ సందేశం)
8. చల్లని వెన్నెలలో… (సంతానం)
9. మనసులోని కోరికా తెలుసు నీకు ప్రేమికా… (భీష్మ)
10. తోటలో నా రాజు తొంగి చూసెను నాడు… (ఏకవీర)
11. శ్రీరామ నామాలు శతకోటి… (మీనా)
12. పలుకరాదటే చిలుకా… (షావుకారు)
13. మము బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి… (రామదాసు కీర్తన)
14. జయ జయ జయ ప్రియభారత జనయిత్రి… (దేవులపల్లి దేశభక్తి గీతం)
15. పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా… (చెంచులక్ష్మి)
16. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌.. (దేవదాసు)
17. కిలకిల నవ్వులు చిలికిన … (చదువుకున్న అమ్మాయిలు)
18. దొరకునా ఇటువంటి సేవ… (శంకరాభరణం)
19. సలలిత రాగ సుధారస సారం… (నర్తనశాల)
20. మనసు పాడింది సన్నాయి పాట… (పుణ్యవతి)
21. రారా నా సామి రారా… (విప్రనారాయణ)
22. పెళ్ళిచేసుకొని ఇల్లుచూసుకొని… (పెళ్ళిచేసి చూడు)
23. పూవైవిరిసిన పున్నమి వేళ… (తిరుపతమ్మ కధ)
24. రావే నా చెలియా… (మంచిమనసుకు మంచి రోజులు)
25. విరిసే చల్లని వెన్నెలా… (లవకుశ)
26. వెలుగు చూపవయ్యా మదిలో కలతా బాపవయ్యా… (వాగ్దానం)
27. హాయి హాయిగా జాబిల్లి తొలి రేయి వెండి దారాలల్లి… (వెలుగు నీడలు)
28. ఆకసమున చిరుమబ్బుల చాటున… (AIR Private Record)
29. సరసాల జవరాలను… ( సీతారామ కల్యాణం)
30. సా విరహే తవదీనా … (విప్రనారాయణ)
31. హిమాద్రి సుతే… (కన్నడ సినిమా “హంస గీతె”)
32. నల్లని వాడా నే గొల్లకన్నెనోయ్‌.. (రావు బాలసరస్వతి ప్రైవేట్‌పాట)
33. సఖియా వివరింపవే … (నర్తన శాల)


              కర్ణాటక సంగీతంలో మరొక ముఖ్యమైన రాగం కల్యాణి. కల్యాణి రాగం శుభప్రదమైనది. కల్యాణ ప్రదమైనది. ఎంతమంది విద్వాంసులు ఈ రాగాన్ని పాడినా, పాడినవారికి, విన్నవారికి ఎప్పటికప్పుడే నిత్య నూతనంగా ఉంటుంది. ఈ రాగం ఆధారంగా జనించిన జన్యరాగాలు అనేకం ఉన్నాయి. హమీర్‌కల్యాణి, బేహాగ్‌, అమృతవర్షిణి, హంసనాదం మొదలైనవి ముఖ్యమైనవి. కర్ణాటక సంగీతంలోని ఐదు ముఖ్యమైన రాగాలైన కల్యాణి, తోడి, శంకరాభరణం, భైరవి, కాంభోజి రాగాల్లో కనీసం ఒక్క రాగమైనా లేకుండా ఒక చిన్న కచేరీ కూడా ఉండదు. అలాంటి ఈ ఐదు రాగాల్లో కూడా ముఖ్యమైన రాగం కల్యాణి.

              కల్యాణి రాగం 65వ మేళకర్త అయిన మేచకల్యాణి నుంచి జనించిన రాగం. మన కర్ణాటక సంగీత సాంప్రదాయంలో ప్రసిద్ధమైన 72 మేళకర్తలు ఏర్పడటానికి ముందే కల్యాణి రాగం ఉందని పండితుల అభిప్రాయం! 72 మేళకర్తల పద్ధతి ఏర్పడిన తరువాత, ఈ పధకం ప్రకారం కల్యాణి రాగం, 65వ మేళకర్త అయిన “మేచకల్యాణి” జన్యం అయింది.పూర్వ వాగ్గేయకారుల ప్రసిద్ధ రచనలు కల్యాణి రాగంలో చాలా ఉన్నాయి. “నిధి చాలా సుఖమా..”, “ఏతావునరా…”, “నమ్మి వచ్చిన…”, అమ్మ రావమ్మ…”, “వాసుదేవయని…”, “సుందరి నీ దివ్య రూపము…” వంటి త్యాగరాజ రచనలే కాక, “బిరాన వరాలిచ్చి…”, “హిమాద్రిసుతే…” వంటి శ్యామ శాస్త్రి రచనలు కూడా ప్రసిద్ధమైనవే!
 
                     మనోధర్మ సంగీతంలో కల్యాణి రాగానికి ఒక ప్రముఖ స్థానం ఉంది. అవకాశం వచ్చింది కాబట్టి మనోధర్మ సంగీతం గురించి రెండు మాటలు చెప్పుకోవాలి.శాస్త్రీయ సంగీతం అభ్యాస సంగీతమనీ, మనోధర్మ సంగీతమనీ రెండు విధాలు. ఇందులో మొదటిది గురుముఖంగా నేర్చుకొనే అలంకారాలూ, గీతాలూ, వర్ణాలూ, కృతులు మొదలైనవి ఉంటే, రెండవ విధానమైన మనోధర్మ సంగీతంలో స్వరకల్పన, రాగం, పల్లవి మొదలైనవి ఉదాహరణలుగా చెప్పవచ్చు.ఈ రెండు విధానాలైన సంగీతాలలో కూడా పాండిత్యం సంపాదించినప్పుడే, సంగీతంలో సంపూర్ణతని సాధించగలుగుతారని విద్వాంసుల అభిప్రాయం. మనలో చాలామందికి శాస్త్రీయ సంగీతంలో పరిచయం, ప్రవేశం లేకపోయినా అంతో, ఇంతో సంగీతం మనకి తెలియటానికి కారణం, మనకి తెలియకుండానే మనం మనోధర్మ సంగీతం అభ్యసించడమే! తేలిక మాటల్లో చెప్పాలంటే, సంవత్సరాల తరబడి సంగీతాన్ని విని, విని వినికిడి అనుభవంతోనే రాగాలు పాడగలిగిన వాళ్ళు మనోధర్మ సంగీత పద్ధతిని పాటిస్తున్నారన్నమాట. సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు పద్మభూషన్‌డా. శ్రీపాద పినాకపాణి గారు మనోధర్మ సంగీతం గురించి చెప్పిన ఈ క్రింది మాటలు ఈసందర్భంలో గుర్తుకు తెచ్చుకోవడం అవసరం.

                        ” తమిళనాడులో, గురువు వద్ద సంగీతం అభ్యసించకపోయినా, సంవత్సరాలపాటు రాగాలాపన విని, వినికిడి అనుభవంతోనే రాగాలు పాడగలిగిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఆంధ్రదేశంలో శాస్త్రీయ సంగీతం అంత ధారాళంగా వినబడడానికి మనం నోచుకోలేదు. అందుచేతనే సంగీతం యధావిధిగా నేర్చిన విద్యార్ధులకు కూడా రాగం పాడే శక్తి రావడంలేదు. గురువే రాగం పాడుతూ విద్యార్ధిచేత పాడిస్తూ నేర్పాలి. నొటేషను వ్రాసి, చదువనేర్చిన విద్యార్ధికి ప్రసిద్ధరాగాలలో తరచూ వినబడే సంగతులను స్వరపరచి వ్రాసిచ్చి, వాటిని కంఠోపాఠంగా వచ్చేవరకూ చెప్పి, పాడించాలి. విద్వాంసులు పాడే రాగాలాపనలను నిరంతరం వింటూ ఉండడం అన్నిటికంటే ఎక్కువ అవసరం. స్వరకల్పన పాడుతూ పాడించినట్లే, రాగం కూడా గురువు నేర్పాలి.

                    ప్రతివిద్యార్ధికీ, “మనోధర్మ సంగీతం”, అభ్యాస సంగీతం లాగే పాఠం చెప్పి నేర్పించాలి. అలా చెప్పగా విద్యార్ధులకు మనోధర్మ సంగీతజ్ఞానం తప్పక లభిస్తుంది. ఇది వట్టి మాట కాదు! అనుభవంతో చెప్పిన సలహా.”
స్వరస్థానాలు పరిచయం

                  కల్యాణి సంపూర్ణ రాగం. అంటే ఆరోహణలోనూ, అవరోహణలోనూ కూడా ఏడు స్వరాలూ ఉపయోగించే రాగం. మూలస్వరాలైన “స”, “ప” లు కాక ఉపయోగించే స్వర స్థానాలు చతిశ్రుతి రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, చతుశ్రుతి దైవతం, కాకలి నిషాదం. కల్యాణి రాగం ప్రయోగ ప్రసిద్ధి రాగం. ముఖ్యంగా పంచమం (స్వరం “ప”) వాడకుండా ఎక్కువ ప్రయోగాలు చెయ్యవచ్చు. అలాగే మూల స్వరాలైన “స”, “ప” లను రెంటినీ విడిచి, “రి గ మ ద ని” స్వరాలతో ప్రయోగాలు చేయ్యవచ్చు. ఆలాపనకి చాలా అవకాశం ఉన్న కల్యాణి రాగం, చాలా elaborateగా పాడి రాగం యొక్క depths చూపించటానికి అవకాశం ఉన్న రాగం ఇది. ఇక్కడ ఒక ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి. అన్ని రాగాలలో creativity చూపించుకోటానికి అవకాశం ఒకే విధంగా ఉండదు! కొన్ని రాగాలు elaborateగా పాడటానికి వీలుండదు (గాయకురాలు/గాయకుడు ఎంత సమర్ధురాలైనా/సమర్ధుడైనా). కీబోర్డ్‌మీద కాని, మరే వాయిద్యం పైన కాని కల్యాణి రాగం వాయించ ప్రయత్నిస్తే, స్వరస్థానాలు ఈ విధంగా ఉంటాయి.
 
స X రి2 X గ2 X మ2 ప X ద2 X ని2 స
ఆరోహణ           సరిగమపదనిసా
అవరోహణ        సానిదపమగరిస

                  కల్యాణి రాగాన్ని “తీవ్ర” రాగం అంటారు. రాగలక్షణంలో తీవ్రమైన అనుభూతుల్ని చూపించకపోయినా, స్వరస్థానాల దృష్య్టా, అన్ని స్వరాలూ “తీవ్ర” స్వరాలే కాబట్టి, కల్యాణి రాగాన్ని “తీవ్ర రాగం” అంటారేమో!
హిందూస్తానీ సంగీతంలో…
హిందూస్తానీ సంగీతంలోని “యమన్‌” రాగం మన కర్ణాటక సంగీత సాంప్రదాయంలోని కల్యాణి రాగానికి సమానం. స్వరస్థానాల్లో కల్యాణికి, యమన్‌కి తేడాలు ఏమీ లేవు. మనసుకు చాలా ఆహ్లాదం కలిగించే ఈ రాగం రాత్రి మొదటి వేళల్లో పాడుకొనే రాగం. పైన చెప్పినట్టు, హిందూస్తానీ సంగీతంలో కూడా మూలస్వరాలైన “స”, “ప”లను విడిచి ప్రయోగాలు చేస్తారు. హిందూస్తానీ పద్ధతిలోని యమన్‌ పకడ్‌ ఈ రకంగా ఉంటుంది.
నిరిగరి స పమగ రి పరిస
ఆరోహణ స్వర సంచారాల్లో “నిరిగ”, “మదని” ఎక్కువగా వాడతారు. అవరోహణ స్వరాల్లో “గ” స్వరాన్ని వదిలేసి, “పరిస” అన్న ప్రయోగం ఎక్కువగా ఉపయోగిస్తారు.
 
సినిమా పాటలు
సినిమా పాటల్లో కల్యాణి రాగాన్ని చాలా ఎక్కువగా వాడారు. ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు బాలమురళీకృష్ణ సంగీత సారధ్యంలో భైరవి నరసయ్య అనే సంగీత విద్వాంసుడి కధను “హంస గీతె” అన్న కన్నడ సినిమాగా తీసారు. సినిమా మొత్తం భైరవి రాగం మీద focus చేసినా, కల్యాణి రాగంలో ఈ సినిమాలో పాడిన “హిమాద్రి సుతే” అన్న శ్యామ శాస్త్రి రచన చెప్పుకోతగ్గది. ఇందులో విశేషం ఏమిటంటే, శ్యామశాస్త్రి రచనని రెండు విభిన్న తాళాలలో ఇద్దరు గాయకులు పాడడం (గాయకులు బాలమురళీకృష్ణ, ఎం. వి. రమణమూర్తి గార్లు) ప్రయోగాత్మకంగా ఉంది. ఈ రెండు పాటలు “కల్యాణి” రాగంలోనే పాడినా, తాళాలు వేరుగా ఉండటం వల్ల కొంత వింతగానూ, కొత్తగానూ ఉంటాయి.
 
                     హిందీ సినిమాల్లో కూడా “యమన్‌” రాగాన్ని విపరీతంగా వాడుకున్నారు. “బర్సాత్‌కి రాత్‌” అన్న సినిమాలో మహమ్మద్‌రఫీ పాడిన “జిందగీభర్‌నహీ భూలేంగే” అన్నపాట, “చిత్‌చోర్‌” సినిమాలో ఏసుదాసు, హేమలతా పాడిన “జబ్‌దీప్‌జలే ఆనా..” అన్న పాట యమన్‌రాగంలో compose చేసినవే! కల్యాణి, యమన్‌రాగాల పోలికలు, తేడాలు తెలియాలంటే తెలుగులోనూ, హిందీలోనూ ఒకేపేరుతో తీసిన “సువర్ణ సుందరి” అన్న సినిమాలో ని “హాయి హాయిగా ఆమనిసాగే..” అన్న తెలుగుపాట, ” కుహూ కుహూ బోలే కోయలియా..” అన్న హిందీ పాట నాల్గవ (ఆఖరి) చరణం జాగ్రత్తగా వినండి. ఈ పాటలు ముందు తెలుగులోనూ, తరవాత హిందీలోను వచ్చాయి. సుప్రసిద్ధ సంగీత దర్శకుడు శ్రీ ఆది నారాయణ రావు సంగీత దర్శకత్వంలో స్వరం కట్టబడ్డ ఈ పాటలు రాగమాలికలు. ఈ పాటల్లోని నాలగవ చరణం ముందు వచ్చే ఆలాపన, తరవాత చరణం పాడుతున్నపుడు ఘంటసాల & జిక్కీ కల్యాణి రాగాన్ని పాడితే, రఫీ & లత యమన్‌రాగాన్ని పాడతారు. సినిమాపాటల ద్వారా ఈ రెండు రాగాలకి పోలికలు, తేడాలు తెలియాలంటే ఈ పాటలు ఒక మంచి ఉదాహరణలు.

          తెలుగు సినిమాపాటల్లో కల్యాణి రాగంలో ప్రఖ్యాత సంగీత దర్శకుడు శ్రీ సాలూరు రాజేశ్వర రావు తీసుకువచ్చినంత variety ఇంకే సంగీత దర్శకుడు తీసుకురాలేదంటే అతిశయోక్తి కాదు. ఈయన పాటల్లో మామూలుగా కనపడే richness కల్యాణి రాగంలో మరీ కొట్టచ్చిన్నట్టు తెలుస్తుంది. దేశద్రోహులు సినిమా కోసం స్వరం చేయబడ్డ “జగమే మారినదీ మధురముగా ఈ వేళ” అన్న పాట కల్యాణి రాగంలో స్వరపరచబడ్డ ఒక గొప్ప తెలుగు సినిమా పాట. పాట మొదలవుతూనే వినిపించే piano ద్వారా set చెయ్యబడ్డ తాళం, ఘంటసాల కంచు కంఠంతో, రెండవ చరణంలో “విరజాజుల సువాసన స్వాగతములు పలుక సుస్వాగతములు పలుకా” తరవాత వచ్చే ఆలాపన అతి మధురంగానూ, లలితం గానూ ఉంటుంది. ఇదే చరణంలో “కమ్మని భావమే కన్నీరై చిందెనూ” తరవాత ఒక చక్కటి violin bit వేస్తాడు రాజేశ్వర రావు. ఇంత గొప్పగా ఇలా compose చేసిన ఈ పాటను, మల్లీశ్వరి సినిమాలోని all time great song “మనసున మల్లెల మాలలూగెనే..” తో పోల్చండి. రెండూ కల్యాణి రాగంలో ట్యూన్‌ చెయ్యబడ్డవే. పి. బి. శ్రీనివాస్‌చే సాలూరి వారు పాడించిన “మనసులోని కోరిక..”అనేపాట కల్యాణి రాగంలో బాణీ కట్టబడ్డ మరొక గొప్ప పాట.చెంచులక్ష్మి సినిమాలోని “పాలకడలిపై శేషతల్పమున …” అన్న గొప్ప భక్తి పాట కూడా కల్యాణి రాగంలో రాజేశ్వర రావు స్వరం ఇచ్చిందే! ఇలా ప్రతి పాటలోనూ మిగిలిన పాటలకన్న తేడాగా ట్యూన్‌ఇస్తూనే, కల్యాణి రాగాన్ని exhaust చేసినట్టనిపిస్తుంది.
 
                        కల్యాణి రాగాన్ని చాలామంది సంగీత దర్శకులు, హుషారైన పాటలకు వాడుకున్నారు. సాధారణంగా విషాద గీతాలకు కల్యాణి వంటి రాగాలు వాడరు. ఇందుకు భిన్నంగా రెండు ఉదాహరణలు ఇస్తాను. ముందు దేవదాసు సినిమా కోసం శ్రీ సుబ్బురామన్‌ఘంటసాలచే పాడించిన “కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌.” అన్న పాట. ఈపాట విన్న మొదట్లో నేను ఇది కల్యాణి రాగం అని గమనించలేదు. Flute మీద వాయించిన తరవాత ఈ పాట కల్యాణి రాగంలో ఇంత గొప్పగా ఎలా ట్యూన్‌ ఇచ్చాడో తెలుసుకున్న తరవాత, శ్రీ సుబ్బురామన్‌గారి మీద గౌరవం పెరిగింది. మాంగల్య బలం (పాతది) సినిమా కోసం మాస్టర్‌వేణు కూడా ఇలాంటి ప్రయత్నమే చేసాడు. “పెనుచీకటాయే లోకం…” అన్న విషాద గీతం కూడా కల్యాణి రాగం అధారంగా బాణీ కట్టిందే. ఈ పాటలో ప్రతి మధ్యమం, శుద్ధ మధ్యమం రెండూ వాడబడ్డాయి.
సినిమా పాట కాకపోయినా, ఘంటసాల పాడిన అనేక private recordsలో బాగా popular అయిన “తలనిండ పూదండ దాల్చిన రాణి …” అన్నపాట కల్యాణి రాగంలో బాణీ కట్టిందే. ఉత్సాహంగా ఏదైనా instrument మీద వాయించే వారికోసం స్వరాలు ఇక్కడ ఇస్తున్నాను.
 
“తలనిండ పూదండ దాల్చిన రాణి …” స్వరాలు
Opening
Notes of Chord స గా పా
ఆరజనీకర మోహన బింబము … మ ప మా
నీనగుమోమును బోలునటే
కొలనిలోని, నవకమల దళమ్ములు, నీ నయనమ్ముల బోలునటే …

ని రి స
ఎచట చూసినా, ఎచట వేచినా, నీరూపమదే, కనిపించినదే …

తలనిండ పూదండ దాల్చిన రాణి
మొలకా నవ్వులతోడ మురిపించబోకే

1st Interlude
సాసాసా దా నీపా దాగా
దాదాదా పా గారీ నీసా

వీణ
దానిరీ గామా దానీసా
మొదటి చరణం
పూల వానలు కురియు మొయిలువో …
మొగలి రేకులలోని సొగసువో … నా రాణి
“తలనిండ…”

2nd Interlude
సాసాసా నీదాపాగారీసా (వీణ) పాగాసరీ
రిగా నీనీనీ దాపాగా రీనీసా (వీణ) గారీనీసా

వీణ
దానీ రీ గా మా దానీ నిగరీ నిదమపా
రెండవ చరణం
నీ మాట బాటలో నిండే మందారాలు … మపమా గారీరి
నీ పాట తోటలో నిగిడే శృంగారాలు… నిసనీ దాపాప
నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు …
నీ నీలవేణిలో నిలిచే ఆకాశాలు….

గాగాగా రిసని దపగా మాదానిసా
“తలనిండ…”

నమ్మకద్రోహం (ఈసప్ కథలు)

ఒక గద్దకు, నక్కకు స్నేహం కుదిరింది. గద్ద చెట్టుమీద గూడు కట్టుకుని ఉంటే, ఆ చెట్టు కింద నివాసం ఏర్పరచుకుని జీవిస్తోంది నక్క.

కొన్నాళ్లకు నక్కకు పిల్ల పుట్టింది. అది ఎంతో సంతోషంగా గద్దకు తన బిడ్డను చూపించింది. అయితే ఓరోజు నక్క ఆహారం తెచ్చుకోవడానికి బయటికి వెళ్లింది. అది అదనుగా చూసుకుని, గద్ద నక్కపిల్లను ఎత్తుకుపోయింది. ఆ పిల్లను చంపేసి తన పిల్లలకు పెట్టి, తనూ తింది.

కాసేపటికి తిరిగి వచ్చిన నక్కకు పిల్ల కనిపించలేదు. గద్దను అడిగితే తనకూ తెలియదంది. కానీ గద్ద చేసిన ద్రోహాన్ని నక్క కనిపెట్టింది. అయినా ఏమీ చేయలేక మౌనంగా రోదించింది.

తర్వాతి రోజు తన గూటికి దగ్గర్లో కొంతమంది వ్యక్తులు ఒక గొర్రెను బలిచ్చి, దాన్ని కాల్చడం కనిపించింది గద్దకు. ఎలాగైనా ఒక ముక్కను ఎత్తుకుపోవాలని అనుకుంది. మెల్లగా వెళ్లి కాస్తంత మాంసాన్ని నోట కరచుకుని పెకై గిరింది. వాళ్లెక్కడ పట్టుకుంటారోనని భయపడి గబగబా గూటికి చేరుకుంది.

అయితే మాంసాన్ని దొంగిలించే ప్రయత్నంలో దాని తోకలోని ఒక ఈకకు అంటుకున్న నిప్పు, ఎండుపుల్లలతో నిర్మించిన గూటికి అంటుకుంది. మంటలకు తాళలేక ఇంకా రెక్కలు రాని గద్దపిల్లలు కింద పడిపోయాయి. అది చూసిన నక్క వాటిని తినేసింది. కళ్లముందే పిల్లలు చనిపోవడం చూసిన గద్ద పెద్దగా ఏడ్చింది. ఆ రోజు తాను నక్కకు ద్రోహం చేయకుండా ఉండివుంటే, ఈరోజు అది తన పిల్లల్ని కాపాడేది కదా అని తనలో తానే కుమిలిపోయింది.

నీతి: నమ్మినవాళ్లను మనం బాధపెడితే, చివరకు మనకూ బాధే మిగులుతుంది.

చీమ-మిడత (Story)

ఒక పొలంలో ఒక చీమ, ఒక మిడత ఉండేవి. చీమ ఎప్పుడూ నెమ్మదిగా నేలమీద పాకుతూ ఏదో ఒక ఆహారం సేకరించుకుని వెళ్లి తన పుట్టలో దాచి పెట్టుకోవడంలో హడావుడిగా ఉండేది.
మిడత మాత్రం హాయిగా, స్వేచ్ఛగా గాలిలో ఎగురుతూ పాటలు పాడుకుంటూ తిరుగుతుండేది. పంటల మీద వాలి, తిన్నంత తిని పాడుచేసినంత పాడు చేసి ఆనందిస్తుండేది.
ఒకరోజు నెమ్మదిగా నేల మీద పాకుతూ తన దేహం కంటే పెద్దదిగా ఉన్న ఒక బియ్యపు గింజను లాగలేక లాక్కుంటూ వెళుతున్న చీమను చూసి మిడత పకపక నవ్వసాగింది.
చీమకు కోపం వచ్చి ‘ఓసి పొగరుబోతు మిడతా! ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నావు?’ అని ప్రశ్నించింది.
అందుకు మిడత ‘‘నిన్ను చూస్తుంటే జాలి వేస్తున్నది. నువ్వెంత, నీ ఆకలి ఎంత? ఎందుకు ఎప్పుడూ ధాన్యం లాక్కువెళ్లి పుట్టలో పెట్టుకుంటూ రోజంతా శ్రమ పడుతుంటావు? నా లాగా హాయిగా పాటలు పాడుకుంటూ తిరగవచ్చు కదా!’ అన్నది.
చీమ ఏమీ సమాధానం చెప్పకుండానే వెళ్లి పోయింది.
కోతలు పూర్తయి పంట అంతా రైతుల ఇళ్లకు వెళ్లిపోయింది.
ఇంతలో భారీ వర్షాలు వచ్చాయి. తోట అంతా వర్షంతో ముద్దముద్ద అయిపోయింది. మిడతకు ఉండటానికి ఇల్లు లేదు. తినడానికి తిండి లేదు.

అప్పుడది చీమ ఇంటికొచ్చి ‘మిత్రమా! వర్షంలో తడిసి పోతున్నాను. ఆకలికి చచ్చిపోతున్నాను. నన్ను కొంతకాలం నీ ఇంట్లో ఉండనివ్వు. నువ్వు దాచుకున్న ఆహారం నాకు కూడా ఇంత పెట్టు’ అన్నది.

చీమ పకపక నవ్వి ‘వర్షాలు వస్తాయని తెలిసే నేను ముందు జాగ్రత్తగా ఆహారం దాచుకున్నాను. ఇప్పుడు వెచ్చగా హాయిగా ఇంట్లో ఉంటున్నాను’ అని చెప్పి లోపలికి వెళ్లిపోయింది.

నీతి: ముందుచూపు అవసరం.

టీవీని ఎంతదూరం నుంచి చూడాలి?

టీవీని ఆన్ చేయగానే పిల్లలు ముందు ముందుకు వచ్చి చూస్తుంటారు. అది ఆ కార్యక్రమాల పట్ల ఆసక్తి కావచ్చు. టీవీని తగిన దూరం నుంచి చూడాలని డాక్టర్లు చెబుతుంటారు. అంటే ఎంత దూరం అనే ప్రశ్న వస్తుంది. మీ ఇంట్లో టీవీ స్క్రీన్ సైజు ఎంతో గమనించి, దానికి నాలుగింతల దూరంలో కూర్చుని చూడటం మంచిదంటున్నారు డాక్టర్లు. ఏ టీవీ అయినా కనీసం 8 అడుగుల దూరం నుంచి చూడటం మంచిది.

టీవీకి సంబంధించిన రెజల్యూషన్ ఎంత ఎక్కువగా వుంటే అందులో కనిపించే చిత్రం నాణ్యత కూడా అంత మెరుగ్గా వుంటుంది. టీవీ తెరమీద మనకు కనిపించే ప్రతి చిత్రం అనేక వేల చిన్న చిన్న రంగురంగుల చుక్కలతో రూపొందుతుంది. వీటినే పిక్సెల్స్ అంటారు. మనకు సరిగా లేదని, గదిలో వెలుగు తక్కువగా ఉందని టీవీ లైటింగ్ పెంచుతుంటారు. ఇది కళ్లకు ఏమాత్రం మంచిది కాదు.

విద్యుత్ ఎలా ప్రవహిస్తుంది?

ఏదైనా విద్యుత్ పరికరం పనిచేయాలంటే అందులో కీలకమైన విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహం జరగాలి. నదిలో నీరు ప్రవహించినట్టే ఆ విద్యుత్ వలయంలో ఎలక్ట్రాన్ల ప్రవాహం జరగాలి.

నదికి నీరు వచ్చే దిశ, వెళ్లే దిశ ఉన్నట్టే విద్యుత్ పరికరానికి ఎలక్ట్రాన్లు చేరే చివర, ఎలక్ట్రాన్లు పోయే చివర అంటూ రెండు ధ్రువాలు ఉండాలి. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఒక ధ్రువాన్ని భూమికి కలిపి రెండవదానిని విద్యుద్వాహినిగా చేస్తారు. భూమికి కలిపిన చివరను న్యూట్రల్‌గాను, విద్యుత్ ప్రవహించే తీగను ఫేజ్ లేదా లైన్ గానూ వ్యవహరిస్తారు.

ప్రతిసారీ మనం ఇళ్లలో గొయ్యితవ్వి భూమికి ఒక వైరును తగిలించలేం కనుక ఇళ్లకు వచ్చే సరఫరాలోనే భూమిని కలిపే సదుపాయమే న్యూట్రల్. ఇక బ్యాటరీల విషయానికి వస్తే విధిగా రెండు తీగలు ఉండాలి. ఇక్కడ ఒక తీగ పనిచేయదు. ఎందుకంటే బ్యాటరీలోనే విద్యుత్ ప్రవాహం ఆరంభమవుతుంది గనుక తిరిగి ఎలక్ట్రాన్లు అక్కడికే చేరాలి. లేకపోతే వలయం తెగిపోతుంది.

ప్రెషర్ కుకర్ ఎలా పనిచేస్తుంది?

అన్నం, కూరగాయలు, పప్పులు ఉడికించే వంటింటి పరికరం ప్రెషర్ కుకర్. దీనిలో వండటం వల్ల వంట త్వరగా అవుతుంది. ఇందులో పలురకాలు కూడా ఉంటాయి. కేవలం అన్నం మాత్రమే ఉడికించేది రైస్ కుకర్.

సాధారణంగా వంటింటి వేడి వాతావరణ పీడనం దగ్గర 100 డిగ్రీల సెంటీగ్రేడ్‌కి మించి ఉష్ణోగ్రత అందించడం కష్టం. ఎందుకంటే ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెంటీగ్రేడ్‌కి దగ్గరకు వచ్చేసరికి నీరు ఆవిరై పోతుంది. అయితే అధిక పీడనంలో ఉంచితే నీరు 100 డిగ్రీల సెంటీగ్రేడు వద్ద ఆవిరికాదు. దాని బాష్పీభవన ఉష్ణోగ్రత పెరుగుతుంది. అంటే నీరు ఆవిరి కాకుండానే 110 లేదా 120 డిగ్రీల సెంటీగ్రేడు వరకూ అధిక ఉష్ణోగ్రతను అందించగలుగుతాం. ప్రెషర్ కుకర్‌లో జరిగేదిదే ఎక్కువ వేడి అందుతుంది. కనుక త్వరగా అన్నం ఉడుకుతుంది.

ఇనుముకి తుప్పు ఎలా పడుతుంది?

మన ఇళ్లల్లోని ఐరన్‌బాక్స్, సైకిళ్లకి తుప్పు పట్టడం చూసే ఉంటారు. ఇనుము తప్పు పట్టేందుకు ముఖ్యకారణం ఆక్సిజన్. నీటిలో తడిసినప్పుడు, గాలిలోని నీటి ఆవిరి చుట్టూ పేరుకున్నప్పుడు ఇనుము నీటితో చర్య జరుపుతుంది. అంటే ఇనుము నీటిలోని ఆక్సిజన్‌ను తీసేసుకుని హైడ్రోజన్‌ను వదిలేస్తుంది. ఇనుము, ఆక్సిజన్ రెండూ కలిసి ఫై ఆక్సైడ్(తుప్పు) తయారై ఇనుముపై పేరుకుపోతుంది. తుప్పు పొడిపొడిగా ఉండి మిగిలిన ఇనుముతో సంబంధం కలిగి ఉండదు. దాంతో రాలి కిందపడిపోతుంది.

తుప్పుపట్టిన వస్తువు బరువు క్రమేపీ తగ్గుతూ కొన్ని రోజులకు అది మొత్తం విడిపోతుంది. దీనివల్లనే ఇనుప వస్తువులకు తుప్పు పట్టకుండా పెయింట్, నూనె, గ్రీజు వంటివి పూస్తారు. ఇవి ఇనుముకు, నీరు, నీటి ఆవిరికి మధ్యన ఉండి ఇనుము ఆక్సిజన్ కలవకుండా చేస్తాయి.

రసాయనాలను గాజుపాత్రలోనే ఎందుకు ఉంచాలి?

గాజుసీసాల్లో రసాయ నాలను ఉంచేందుకు రెండు కారణాలుఉన్నాయి. ఒకటి గాజు రసాయనికంగా స్థిరమైనది. ఆమ్లాలు, క్షారాలు, విషాలు, నూనెలు, సేంద్రియ పదార్థాలు ఏవీ గాజుతో చర్య చెందవు. రెండోది... గాజు పారదర్శకత వల్ల లోపల ఏముందో, ఎలాఉందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాంతి సమక్షంలో చర్యలకు లోనయ్యే కొన్ని రసాయనాలను రంగు గాజు పాత్రలలో ఉంచుతారు.

ఉదాహరణకు హైడ్రోజన్ పెరాక్సైడ్, అసిటోన్, బెంజిన్ వంటి ద్రవాలను గోధుమరంగు పారదర్శక గాజు పాత్రల్లో నిల్వ ఉంచుతారు. ఎలాంటి గాజు సీసాల్లోనూ నిల్వ చేయలేని పదార్థాలు కూడా కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం(హెచ్‌ఎఫ్)ను గాజు పాత్రలలో ఉంచకూడదు. గాజులోని సిలికెట్లతో అది రసాయనికచర్య జరపడమే అందుకు కారణం. చటుక్కున మండే దహన శీలత ఉన్న పదార్థాలను కూడా గాజు పాత్రల్లో ఉంచరు. పొరపాటున పగిలితే ప్రమాదం.

70 ఎం.ఎం. అంటే ఏమిటి?

మామూలు ప్రొజెక్టర్‌లో రీళ్లు తిరిగే ఫిల్మును 35 ఎం.ఎం.ఫిల్మ్ అంటారు. దీని అడ్డం 35 మిల్లీమీటర్లు (లెన్స్‌లో), నిలువు సుమారు 26 మిల్లీ మీటర్లు(లెన్స్‌లో) ఉంటుంది. పెద్ద థియేటర్లలో వాడే ఫిల్ము అడ్డం కొలత 70 ఎం.ఎం. ఉంటుంది. సాధారణంగా ఎడమ నుంచి కుడికి ఎక్కువ విస్తారాన్ని, పైనుంచి కిందికి తక్కువ విస్తారాన్ని చూస్తుం టాం. అందుకే థియేటర్లలో తెర ఎడమ కుడి దిశల్లో ఎక్కువగా, పైనుంచి కిందికి తక్కువగా ఉంటుంది. ఇలా అడ్డానికి, నిలువుకి ఉన్న నిష్పత్తిని ఆస్పెక్ట్ నిష్పత్తి అంటారు.

చాలాకాలం పాటు ఇది 4:3 నిష్పత్తిలో ఉండేది. సినిమా స్కోపు ప్రక్రియలో ఇది 16:9 లేదా 37:20 లేదా 47:20 నిష్పత్తిలో ఉంటుంది. ఆ విధంగా క్రమేపీ నిలువుకంటే అడ్డం పెరుగుతూ వచ్చింది. తద్వారా కుడినుంచి ఎడమకి ఎక్కువ విస్తారంలో దృశ్యాల్ని తెరమీద చూసే అవకాశం ఏర్పడింది. అంటే 4:3 నిష్పత్తి ఉన్న తెరమీద కంటే సినిమా స్కోపు తెరమీద ఎక్కువ పాత్రలను, దృశ్యాలను మొహరించవచ్చు. సాధారణ తెర అయినా, సినిమా స్కోపు తెర అయినా, బొమ్మను పంపే ఫిల్మ్‌లో దృశ్యం పొడవు, వెడల్పుల నిష్పత్తి మాత్రం మారదు.

Sunday, February 24, 2013

Low Power Audio Amplifier

Another super-simple circuit. You could use this circuit to drive a low power speaker from a sound effects module or a noise generator. Or you could build your own amplified speakers for use with your computer.
 
As shown (with no gain setting network between pins 1 and 8) the circuit amplifies the input signal by 20X. A gain of 200X can be obtained by connecting a 10uF capacitor between pins 1 and 8. Connect a resistor in series with the 10uF capacitor for intermediate gain values. A 1.2K series resistor, for example, results in a gain of 50X.

Monday, February 18, 2013

Automatic Washbasin Tap Controller

Automatic Washbasin Tap Controller

Akshay Mathur and Abhay Mathur

Make your washbasin tap work automatically when you put your hands just below the water tap outlet. This infrared-based system detects any interruption of the IR rays by your hands or utensil and water automatically starts flowing out of the tap.

The circuit is built around 555 timers and comprises transmitter and receiver sections. Both the transmitter and the receiver work off 5V DC. The IR rays continuously emitted by the transmitter fall on the receiver. As soon as an obstacle comes in between the receiver and the transmitter, interrupting the IR rays, the output of the IR sensor goes low momentarily to trigger the timer circuit in the receiver and water comes out for eleven seconds through the tap.

Fig. 1: Transmitter circuit

The transmitter is built around timer IC 555, which is used as an astable multivibrator to generate around 38 kHz frequency (see Fig. 1). The timer output is fed to transistor T1, which drives the IR LED (LED1). Note that IR LED1 must be properly oriented towards the IR sensor module of the receiver circuit. Its transmission wavelength of 900 to 1100 nm lies in the peak receptivity range of TSOP1738 receiver module.


The receiver circuit comprises the sensor module, monostable timer and relay driver circuit (see Fig. 2). The sensor module TSOP1738 is sensitive to IR radiation modulated at 38 kHz. Its normally high output goes momentarily low when any IR radiation is detected or interrupted.

Fig. 2: Receiver circuit
When IR rays falling on the receiver are interrupted, the sensor output goes low momentarily to trigger timer IC2. The output of the timer goes high for eleven seconds and the relay drives the solenoid. During this time period, energisation of the solenoid lifts up the valve fitted in the pipe to let water flow out of the tap. Solenoid valves used specifically for this purpose are shown in Fig. 3.


The relay driver circuit consists of resistor R8, transistor BC548 (T2) and free-wheeling diode D1. Diode D1 protects the relay from damage by high voltages generated by the back emf when the relay is de-energised.

The time period for which the timer goes high can be calculated as follows:
Ton=1.1 R6C5=1.1×100×103×100×10–6=11 seconds

Fig. 3: Mains 230V AC 2/2-way semi-pilot,diaphragm type, solenoid valves
Use shielded wires or leads for installing the IR LED and the IR sensor at opposite sides of the washbasin. Install the IR LED and IR sensor around half a metre apart such that the IR rays transmitted by the IR LED directly fall on the IR sensor. Now switch on the power supply to the circuit.


When you put your hands between the IR LED and IR sensor, the relay energises to make the solenoid open up the valve and water flows out of the tap.

Timer for Mosquito Destroyer

Timer for Mosquito Destroyer 

In electric-heating mosquito repellents, an electric vaporiser heats up a mat or liquid to release non-degrading chemicals into the air and keep the mosquitoes away from the closed surroundings.
Here's a circuit that introduces a time gap in the operation of the va val of 15 minutes without reducing the repellent action on mosquitoes.

The circuit (Fig. 1) doesn't use any transformer-based power supply and is therefore compact enough to enclose inside the switchboard. it is directly powered by 230V AC mains through voltage-limiting resistor R6 (22-kilo-ohm). The low-voltage AC is rectified by diodes D1 and D2, filtered by capacitor C3 and regulated by zener diode ZD1 to provide 12V DC.



Fig. 1: Timer circuit for mosquito destroyer

The timer action is achieved using 14-state binary counter IC HEF 4060 (IC1). Oscillations of the IC are controlled by C2, R2 and R3 and indicated by the flashing of LED1 connected to Q3 output (pin 7) of IC1.

When the circuit is powered-on using switch S1, IC1 resets through capacitor C1 and resistor R1 and starts oscillating. After 15 minutes, its Q11 output (pin 1) goes high to trigger triac BT136 (triac1) through resistor R5. Once the triac fires, the neutral line reaches the plug socket through M2 terminal of the triac. The vaporiser connected to the plug socket turns on for 15 minutes and then turns off. This cycle repeats until power switch S1 is turned off. Thus the circuit helps to reduce the amount of chemical vapours in the inhaling air. As the vaporiser works only half of the time, it reduces the power consumption to half, doubling the days of usage.

Assemble the circuit on a general-purpose PCB ensuring adequate spacing between the components. Sleeving is necessary for the exposed leads of components, especially triacs and diodes. Enclose the circuit in the switch box and connect the plug socket as shown in the circuit diagram. Fig. 2 shows the author’s prototype Caution. The circuit carries 230V AC, so take utmost care while testing and fixing it to avoid lethal shock. Assemble it only if you are experienced and competent to handle high voltages.


Fig. 2: Author's prototype of timer for mosquito destroyer

Over-Speed Indicator

Over-Speed Indicator

This circuit is designed for indicating over-speed and direction of rotation of the motor used in mini hand tools, water pump motors, toys and other appliances.

A 12V DC motor (M1) is coupled to the rotating part of the appliance with a suitable fixing arrangement. When the motor rotates, it develops a voltage.

This over-speed indicator is built around operational amplifier CA3140 (IC1). Set the reference voltage (depending on the desired speed) by adjusting preset VR1 at pin 2 of IC1. When the voltage developed at pin 3 of IC1 is higher than the reference voltage at pin 2, output pin 6 of comparator IC1 goes high to sound piezobuzzer PZ1 and light up LED3.
The rotation indicator circuit is built around AND gate 74LS08 (IC2). Pin 2 of gate N1 goes high when the motor rotates in forward direction, while pin 1 of gate N1 is pulled high via resistor R2. When both pins 1 and 2 are high, output pin 3 of gate N1 goes high to light up LED1. Similarly, pin 5 of gate N2 goes high when the motor rotates in reverse direction. When both pins 4 and 5 are high, output pin 6 of gate N2 goes high to light up LED2.

చంద్రుడిపై వాసం మంచిది కాదా?

చంద్రుడి దగ్గరకు వెళితే ప్రమాదమా అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. చంద్రుడిమీద ఉండే ధూళికణాలు కేన్సర్‌కు కారణమవుతాయని అంటున్నారు. చల్లని వెన్నెల నెలరాజు అనారోగ్యాన్ని కూడా అంతే బాగా అంటగడతాడట. కోట్లాది సంవత్సరాలుగా సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల ధార్మికతకు లోనైన అక్కడి మట్టి చంద్రశిలలుగా గడ్డకట్టుకుపోయింది. ఈ చంద్రశిల నుంచి వచ్చే ధూళి కేన్సర్ కారకమని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఎంతో మెత్తగా ఉండే ఈ ధూళి ఊపిరితిత్తుల్లోకి సులభంగా చేరుతుంది.

ఈ కారణంగా అనేక ఆరోగ్య సమస్యలతోపాటు కేన్సర్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయట. గుండెజబ్బులకు కారణమయ్యే అవకాశాలూ ఉన్నాయట. చందమామ మీదకు వెళ్లి వచ్చిన వ్యోమగాములు శ్వాససంబంధమైన సమస్యలు ఎదుర్కొన్నారని శాస్త్రవేత్తలు ఉదహరిస్తున్నారు. వారి దుస్తులకు అంటుకొన్న చంద్రధూళి అంతరిక్షనౌకలో చేరడం ఇందుకు కారణమంటున్నారు. అందుకే చందమామపై ఉండటం, అక్కడి గాలి పీల్చడం చాలా ప్రమాదకరమట!

సింగినాదం - సంగీత వాద్యం

సింగినాదం లేదా సింహనాదం ఒక సుషిర వాద్యం. బాకాను పోలి ఉంటుంది. పెద్ద ధ్వనులు చేయడానికి ఉపయోగపడే వాద్యం. దీని మొదలు సన్నగాను, చివర వెడల్పుగాను ఉంటుంది. ఈ వాద్యం ద్వారా అనేక ధ్వనులను సృష్టిస్తారు.

పూర్వం వర్తకులు ఆంధ్రప్రాంతానికి వచ్చినపుడు తమ రాకను తెలుపుతూ పెద్ద పెద్ద బర్రె కొమ్ములతో ఊదేవారట.

పెద్ద పెద్ద ధ్వనులు రావడం వల్ల వీటిని సింహనాదాలుగా వ్యవహరించి ఉండవచ్చు. అదే సింగినాదంగా రూపాంతరం చెంది ఉంటుందని భావిస్తున్నారు.

రామానుజ మతస్థులు తమ వైష్ణవ గురువుల రాకను సూచించేందుకు ఈ వాద్యాన్ని ఉపయోగించేవారట.

Sunday, February 10, 2013

క్యాన్సర్‌కు ఆయుర్వేద చికిత్స...

ఆయుర్వేదంలో ప్రాచీనవైద్యుడు చరకమహర్షి నిరూపించిన విషయం: శరీరంలోని ఏ అవయవానికైనా, ఏ భాగానికైనా మూలం కంటికి కనబడని సూక్ష్మాతిసూక్ష్మమైన, అసంఖ్యాకమైన పరమాణు సముదాయమే. (శరీరావయాస్తు పరమాణు భేదానం ఆపరిసంఖ్యేయా భవంతి, అతిబహుత్వాత్, అతి సౌక్ష్మాత్, అతీంద్రియ త్వాత్ చ). ఇలాంటి పరమాణువుల స్వభావ క్రియ భేదాల వల్ల సప్త ధాతువులైన... రస, రక్త, మాంస, మేదో, అస్థి, మజ్జా, శుక్రాలు’, వాటి తో పాటు వివిధ స్రోతస్సులు ఉత్పత్తి కాబడ్డాయి.

క్యాన్సర్ అనే పదానికి అర్థం ‘ఎండ్రకాయ’ (కర్కాటకం). నిశ్శబ్దంగా దొలిచి దొలిచి ధ్వంసం చేయడానికి ఇది పెట్టింది పేరు. వ్యాధి స్వభావాన్ని బట్టి దీనికి ఈ పేరు వచ్చింది. ఇలాంటి స్వభావం గల వ్యాధులు ఆయుర్వేదంలో చాలా వాటిని వర్ణించారు. ఈ వ్యాధి సోకిన ధాతువును బట్టి, స్రోతస్సును బట్టి, అవయవాన్ని బట్టి, భాగాన్ని బట్టి పేరు మారుతుంటుంది. పైన చెప్పిన వాటిలో దేనికి సంబంధించినవైనా కొన్ని అణువులు ‘నివారింపశక్యంకాకుండా, అవాంఛితంగా పరిమాణంలో పెరిగిపోతుండటమే’ ఈ వ్యాధిలో జరిగే ప్రక్రియ. అణువిభజనకు వాతం (న్యూక్లియస్ కర్మలు), పచింపబడటానికి పిత్తం (మైటోకాండ్రియా కర్మలు), పోషణకు కఫం (ప్రోటోప్లాజం కర్మలు) కారణంగా నిలుస్తాయి.

కొన్ని వ్యాధుల పేర్లు
తీవ్రస్థాయికి చేరిన అర్బుద, గ్రంథి, అపచి, గండమాల మొదలైనవి. అర్బుదాలు (కణుతులు), తాలువు, నాలుక, ముక్కు, చెవి, రొమ్ముల్లో కూడా పుడతాయని వాగ్భటాచార్యులు ప్రత్యేకంగా చెప్పారు. అదేవిధంగా ఉపద్రవస్థాయికి చేరిన రస మరియు రక్తవహస్రోతో దుష్టి లక్షణాలే ఈ నాటి బ్లడ్‌క్యాన్సర్లు.

వ్యాధికి కారణాలు
అసలు కారణం స్పష్టంగా తెలియదు. వాతపిత్తకఫాల ప్రాకృత కర్మలను చెడగొట్టే ఆహార విహారాలు, ధూమ, మద్యపానాలు, ఇతర మాదకద్రవ్యాలు, విపరీతమైన మానసిక ఒత్తిడి కారణాల్లో కొన్ని. ప్రస్తుతం సమాజంలో 90 శాతం ఆహారపదార్థాలు, పాలు, తినుబండారాలు, నూనెలు, పండ్లు సమస్తం కల్తీయే. ఇది కూడా ఈ ‘కర్కశకర్కాటకాని’కి కారణమే.

చికిత్స
వ్యాధి తీవ్రతను బట్టి ‘ప్రవర, మధ్యమ, అవర’ అని విభజించబడింది. ప్రవరావస్థలో ఫలితాలు బాగుంటాయి. ఆయుర్వేదం కేవలం రోగవ్యతిరేక చికిత్స మాత్రమే కాకుండా రోగికి బలవర్థకమైన ‘రసాయన’ చికిత్స, అవసరాన్ని బట్టి శోధన (పంచకర్మ) చికిత్స, శస్త్రచికిత్సతో పాటు రోగం సోకిన భాగాన్ని బట్టి ఎన్నో ఔషధాలను విశదీకరించింది.

కొన్ని ముఖ్య ఔషధాలు
ఏకద్రవ్యాలు:
భల్లాతకీ (నల్లజీడిగింజ)
అమృతా/గుడూచీ (తిప్పతీగె)
చిత్రక (చిత్రమూలం)
హరిద్రా (పసుపు)
అశ్వగంధ (పెన్నేరుగడ్డ) ప్రధానమైనవి.

ఇతర ఏకమూలికలలో: శిరీశ్రీ (దిరిసెన), సీతాఫల, తులసి, మారేడు, తమలపాకు, లశున (వెల్లుల్లి), నేల ఉసిరిక (భూమ్యామలకి), కటుకరోహిణి, బ్రాహ్మీ, శతావరీ (పిల్లిపీచర), అశోక, మంజిష్ఠ, దుగ్ధిక, త్రిఫలాలు (కరక్కాయ, తానికాయ, ఉసిరి), పాషాణభేది (కొండపిండి) మొదలైనవి చాలా చెప్పబడ్డాయి.

మిశ్రమ ఔషధాలు:
భల్లాతకీ లేహ్యం
అమృత భల్లాతకీ లేహ్యం
అగస్త్యరసాయనం
అశ్వగంధాది లేహ్యం
చిత్రకహరీతకీ రసాయనం
ఆమలకీ రసాయనం
గుడూచీసత్వం మొదలైనవి.

గమనిక: రోగి బలాన్ని, వ్యాధి సోకిక భాగాన్ని, అవయవాన్ని బట్టి ఏ ఔషధం, ఏ రూపంలో, ఎంతకాలం వాడాలో ఆయుర్వేద నిపుణులు నిర్ణయించి, పర్యవేక్షించాలేగాని, బైరాగి చిట్కాలు, సాధువుల వైద్యాలు క్యాన్సరును పోగొట్టలేవు. అలాంటి ప్రకటనలకు మోసపోవద్దు.

ఆయుర్వేద మార్గంలో నివారణ
బాల్యం నుంచి శాస్త్రబద్ధంగా కల్తీలు లేని, బలవర్ధకమైన సాత్వికాహార సేవన ఆవునెయ్యి, నువ్వుల నూనె రోజూ రెండేసి చెంచాలు సేవించాలి

పాలు, పెరుగు, వెన్నలు ఆవువైతేనే శ్రేష్ఠం. ఇవి రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి

పరిమిత వ్యాయామం, జీవితాంత ప్రక్రియగా భావించి, ప్రతిదినం చేయాలి

దూమ, మద్యపానాల వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి

రాత్రి కనీసం ఏడు గంటలు నిద్రించి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలి

మానసికారోగ్యం కాపాడుకోవడం ప్రధానం. కాబట్టి సంతోషం, శాంతం, ఉత్సాహం, కారుణ్యం వంటి లక్షణాలను అనుసరించాలి. (తనకోపమె తన శత్రువు, తన శాంతమె తనకు రక్ష). వీటిని ఆయుర్వేదంలో ‘ఆచార రసాయనా’లంటారు

ఉసిరికాయరసం రోజూ రెండు చెంచాలు తాగాలి లేదా త్రిఫలా చూర్ణం రోజూ ఒక చెంచా తేనెతో

పది తులసి ఆకులు, ఐదు మారేడు ఆకులు నమిలి తినాలి

ఏదో ఒక తాజా ఫలం ప్రతిరోజూ తినాలి. 
Source : Sakshi

విచిత్ర వీణ - సంగీత వాద్యం

ఉత్తర భారతదేశానికి చెందిన హిందూస్తానీ సంగీత సంప్రదాయానికి సంబంధించిన తంత్రి వాద్యమే విచిత్రవీణ.

దీన్నే గోటు అనీ అంటారు. ఇది కర్ణాటక సంగీతానికి సంబంధించిన చిత్రవీణకు దగ్గరగా ఉంటుంది. ఇది పురాతన ఏక త్రంతవీణ కి ఆధునిక రూపం.

సాధారణ వీణలో రెండు అసమానమైన తంబురాలు ఉంటాయి. కానీ విచిత్రవీణలో ఇందుకు భిన్నంగా రెండు తంబురలు సరి సమానంగా ఉంటాయి. వీణ రెండు కొనలు నెమలి ఆకృతిలో ఉంటాయి.

పటారి మూడడుగుల పొడవు ఆరు అంగుళాల వెడల్పుగా ఉంటుంది. విచిత్రవీణను వాద్యకారుడు తన ఒడిలో కాకుండా తన ముందు నేల మీద పెట్టి వాయిస్తాడు.

దీనికి మొత్తం 22 తంత్రులు ఉంటాయి వాటిలో నాలుగే ముఖ్యమైనవి. వాటితో అటు మరో అయిదు సహాయక తంత్రులు కూడా ఉంటాయి.

కుడిచేతి చూపుడు, మధ్య వేళ్లను ఉపయోగించి ముఖతంత్రులను వాయిస్తూ చిటికెనవేలి కింది వరుసన గల తంత్రులను వాయిస్తారు. రాపిడిని అరికట్టడానికి కొబ్బరి నూనె వాడతారు.

సారంగి - సంగీత వాద్యం

భారతీయ సంగీతవాద్యాలలో సారంగి కూడా ప్రధానమైనదే. ఇది వొంపు తిరిగి ఉండే వాద్యపరికరం.

దీన్ని నేర్చుకోవడం అంత సులభం కాదు. కేవలం రెండున్నర అడుగుల ఉండే ఈ చిన్న వాద్యపరికరాన్ని ఫిడేలు వలె కమానుతో వాయిస్తారు. అయితే దీని కమాను బాణంలా ఉంటుంది. ఈ కమానుకు కూడా గుర్రపు తోక వెంట్రుకలు తీగెలుగా ఉంటాయి.

సారంగిని నల్లకొయ్యతో తయారుచేస్తారు. చూడ్డానికి రెండున్నర అడుగుల పెట్టెలా ఉంటుంది. దీని వెడల్పు ఆరు అంగుళాలు ఉంటుంది. కొన్ని కాస్తంత పెద్దవి కూడా ఉన్నాయి. సారంగి కింది భాగం లోపల ఖాళీగా ఉంటుంది.

దీనివల్ల శబ్దం వీనులవిందుగా ప్రతిస్పందిస్తుంటుంది. దీనికి పల్చని మేకచర్మం తొడుగు ఉంటుంది. సారంగి చివరిభాగం గిటార్‌కివలె పైకి వొంపు ఉంటుంది. అక్కడి నుంచి తలభాగానికి ప్రధానంగా మూడు లేదా నాలుగు తీగెలు ఉంటాయి. ఇవేగాకుండా మరో 35 తీగెలు ఉంటాయి.

దండానికి ఎడమభాగం పక్కన 12 మీటలు, సారంగి చివర రెండువైపులా నాలుగేసి మీటలు ఉంటాయి.
విద్వాంసుడు బాణంవంటి కమానుతో ప్రధాన ఆరుతీగెలమీదా వాయిస్తున్నపుడు రాగాన్ని అనుసరించి మీటలు సవరించినపుడు మిగతా తీగెలు సహకరించి వీనులవిందుచేస్తాయి.

సారంగిపై కొన్ని ప్రత్యేక రాగాలు మరింత వినసొంపుగా ఉంటాయి. దీన్ని వాయించడంలో ఎన్నో ప్రత్యేకతలు పాటించాల్సి ఉంటుంది.

పియానో - సంగీత వాద్యం

పియానోను తొలినాళ్లలో పియానోఫోర్టి అని పిలిచేవారు. సుమారు 1700-1720 మధ్యకాలంలో ఉన్న హార్ప్ సికోర్డ్ అనే వాద్యం పియానోఫోర్ట్‌గా రూపాంతరం చెందిందని అంటారు. ఫ్లారెన్స్ రాజు ఫెర్డినాండ్ ఆస్థానంలోని బి.ఎల్. క్రిస్టోఫర్ దీన్ని తయారు చేశాడు.
పారిశ్రామిక విప్లవం మూలంగా ఉత్తమ నాణ్యత కలిగిన పియానో వైరు, కాస్ట్ ఐరన్ ఫ్రేమ్‌లు అందుబాటులోకి రావ డంతో పియానో స్థాయి 5 ఆక్టేవ్‌ల నుంచి 8 ఆక్టేవ్‌లకు పెరిగింది. నిటారుగా ఉండే పియానోను 1780 ప్రాంతాల్లో ఆస్ట్రియాకు చెందిన జోహాన్ స్మిత్ రూపొందించాడు.

1802లో లండన్‌కు చెందిన థామస్‌లౌడ్ ఆ పియానో తీగెలు అడ్డంగా అమర్చి సరికొత్త రూపు తెచ్చాడు. 1881లో కేంబ్రిడ్జ్‌కి చెందిన పియానో ప్లేయర్ జాన్ మెక్‌టామ్నే తయారుచేసిన పియానోకి యాంత్రిక సంగీతపరికరంగా పేరు వచ్చింది. సౌకర్యవంతమైన చిల్లులు కలిగిన సన్నని కాయితాలను అమర్చడం ద్వారా ఇది పనిచేసేది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌కి చెందిన లెవీనాక్స్ దీన్ని మరింత మెరుగుపరిచాడు. కాగా విద్యుత్ తో పనిచేసే పియానోను విలియం ఫ్లెమింగ్ కనుగొన్నాడు.

హిప్నాటిజం అంటే ఏమిటి?

మనిషి మానసిక స్థితిని మార్చడం లేదా నియంత్రించగలగటం. ఇది చేసేవారిని హిప్నాటిస్ట్ అంటారు. అనాదిగా మనిషి ఊహించని శక్తిసామర్థ్యాలు చేసిచూపడంలో ఈ కళను ఉపయోగిస్తున్నాడు. దీన్ని గురించి వియన్నాలో డాక్టర్ మెస్మర్ తొలిసారిగా శాస్త్రీయపరిశోధన చేపట్టాడు. చాలాకాలం ఈ కళను మెస్మరిజం అనే వారు. ఇది డాక్టర్ మెస్మర్ పేరున వచ్చింది. 1840లో స్కాట్లాండ్‌కి చెందిన సర్జన్ జేమ్స్ బ్రైడ్ తొలిసారిగా దీన్ని ‘హిప్నాటిజం’ అని పేరుపెట్టి ప్రచారం చేశాడు.

గ్రీక్‌లో హిప్నోస్ అంటే నిద్రాస్థితి అని అర్ధం. దీన్నించే వచ్చింది హిప్నాటిజం అనే పదం. హిప్నటైజ్ చేయబడిన వ్యక్తి హిప్నాటిస్ట్ అధీనంలోకి వస్తాడు. అతను ఏది చెబితే అది చేస్తాడు. అయితే అలా హిప్నటైజ్ అయేందుకు పూర్తిగా అంగీకరిస్తేనే వీలుపడుతుంది. హిప్నటిస్ట్ ఆ వ్యక్తిని తన అధీనంలోకి తీసుకుని తాను చెప్పినట్టు వింటాడు, ప్రశ్నలకు సమాధానాలూ చెబుతాడు. ఏదైనా అంశాన్ని గురించి అడిగినపుడు దానికి సంబంధించిన వివరాలు తెలియజేయగ ల్గుతాడు. హిప్నటైజ్ అయిన వ్యక్తి ఆ స్థితి నుంచి బయటపడిన తర్వాత అప్పటి వరకూ ఉన్న తన పరిస్థితిని గుర్తుంచుకోలేడు.

శాక్సోఫోన్ - సంగీత వాద్యం

పెద్ద పెద్ద ఆర్కెస్ట్రాల్లో శాక్సోఫోన్ వాద్యాన్ని చూస్తారు. 19వ శతాబ్దం తొలినాళ్లలో ఫ్రాన్స్‌లో సంగీత కార్యక్రమాల్లో దీన్ని కూడా ప్రదర్శిస్తుండేవారు. ఇది తొలినాళ్లలో సింగిల్ రీడ్ క్లారినెట్‌లా వేళ్లను ఎక్కువ ఉపయోగించే సంగీతవాద్యపరికరంగా ఉండేది. దీని శబ్దం ఇత్తడి, కొయ్యలతో తయారుచేసిన వాద్యసాధనాలకు అనుగుణంగా ఉండేది. క్రమేపీ ఈ వాద్యం ఎన్నో మార్పులు చెంది సోలో ప్రదర్శనకు వీలయింది.

శాక్సోఫోన్స్ ఎనిమిది సైజుల్లో, గాలి పరికరాల శబ్దస్థాయికి తగినవిధంగా తయారుచేసేవారు. సాధారణంగా మనకు కనిపించేవి ఆల్టో, టీనర్ శాక్సోఫోన్స్. వీటిని జాజ్ బాండ్స్‌లో, డాన్స్ ఆర్కెస్ట్రాల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు. జాజ్ వాయించేవారు శాక్సోఫోన్స్‌కి ఎంతో ప్రాధాన్యతనిస్తుంటారు.

నాల్ - సంగీత వాద్యం

ఇది రెండు తలల డ్రమ్ వాద్యం. ఈ వాద్యపరికరాన్ని మృదంగం వలె అడ్డంగా పట్టుకోవాలి. ఇది రెండువైపులా చేతులతో తడుతూ వాయించే వాద్యపరికరం.

ఇది జానపద సంగీత వాద్యం. దీన్ని గ్రామీణులు వారి శుభకార్యాల్లో పాడుకునే సమయంలో వాయిస్తుంటారు.

ఈ వాయిద్యానికి ఉపయోగించే షెల్స్ ఉత్తర ప్రదేశ్‌లో తయారుచేస్తారు. సాధారణంగా గ్రామాల్లో లభించే వేప, ఎర్రచందనం చెక్కతోనే తయారుచేస్తారు. వీటి తలలను మేకతోలుతో, నట్లు, బోల్టులతో బిగిస్తారు. తద్వారా మంచి నాదం వస్తుంది. ఈ నట్లు, బోల్టులను అవసరమైనపుడు బిగిస్తూ, మారుస్త్తూ, నాదాన్ని మరింత సరిచేస్తుంటారు.

ఇది చూడ్డానికి పక్వాజ్ అనే సంగీత వాద్య పరికరాన్ని పోలి ఉంటుంది. పొడవు పరంగా చూస్తే నాల్ పక్వాజ్ కంటే చిన్నది. చిత్రమే మంటే నాల్ ఒకవైపు ఊహించనివిధంగా తారస్థాయి నాదం ఉంటుంది. మరొకవంక డోలక్ వలె మంద్ర స్థాయి ఉంటుంది.

చంద్రుడు ఎందుకు అలా కనపడతాడు?

భూమిచుట్టూ చంద్రగోళం తనచుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. ఈ తిరగడంలోనూ చిత్రమేమంటే చంద్ర గోళం తనచుట్టూ తాను తిరగడానికి ఎంతకాలం పడుతుందో, ఇంచుమించు అంతే కాలంలో భూమి చుట్టూ కూడా తిరుగుతుంది. కనకనే మనకు ఎప్పుడూ చంద్రుడిలో ఒక వైపే కనపడుతుంది. అయితే ఇలా తిరగడంలో భూమి ఆకర్షణ శక్తి లక్షల సంవత్సరాలుగా పనిచేస్తూ ఈ రకమైన ఏర్పాటుకు దారితీసిందంటారు శాస్త్రవేత్తలు.

భూమి నుంచి చూసేవారికి చంద్రబింబం కొంచెం వెనక్కి, ముందుకు ఊగిసలాడుతున్నట్టు ఉంటుంది. అందుకే చంద్రుడు కనిపించేది ఒకే భాగమయినా, అందులోనే ఒకింత తేడా కనపడుతుంది. దీనికి రెండుకారణాలున్నాయి. చంద్రుడు భూమి చుట్టూ తిరగడం ఒక సరయిన వృత్తాకార మార్గంలో కాదు. అంటే కొంచెం సాగదీసిన వలయాకారంగా ఉంటుంది. కనుకనే తిరిగే వేగం, దూరాన్ని బట్టి, చుట్టూ తిరిగే వేగం కంటే కొంచెం ముందుకు, వెనక్కీ ఉంటుంది.

Tuesday, February 5, 2013