అవసరం లేకున్నా మందులను వాడటం, అవసరాన్ని మించి మందులను వాడటం, వాడాల్సిన పద్ధతిలో వాడాల్సినన్ని రోజులు వాడకపోవడంతో పాటు కల్తీమందులు లేదా నాసిరకం మందులు కూడా వివిధ సూక్ష్మజీవులు తిరిగి శక్తి పుంజుకోవడానికి కారణమవుతున్నాయి.
ప్రస్తుతం టీబీ వల్ల ప్రపంచంలో ఏటా 20 లక్షలమంది చనిపోతున్నారు. ప్రతి ఏటా కొత్తగా 30 నుంచి 50 కోట్ల మందికి కొత్తగా మలేరియా వస్తోంది. ఈ వ్యాధికి గురైనవారిలో ఏడాదికి 27లక్షలమంది చనిపోతున్నారు. ఇక ఫ్లూ జ్వరం వంటివ్యాధుల బారిన పడే వారి సంఖ్య లెక్కలేదు. ఇలాంటి వాటన్నింటికీ వ్యాధికారక సూక్ష్మజీవుల మందులను వాడే విషయంలో మనందరం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
0 comments:
Post a Comment