Showing posts with label Stories. Show all posts
Showing posts with label Stories. Show all posts

Tuesday, February 26, 2013

నమ్మకద్రోహం (ఈసప్ కథలు)

ఒక గద్దకు, నక్కకు స్నేహం కుదిరింది. గద్ద చెట్టుమీద గూడు కట్టుకుని ఉంటే, ఆ చెట్టు కింద నివాసం ఏర్పరచుకుని జీవిస్తోంది నక్క.

కొన్నాళ్లకు నక్కకు పిల్ల పుట్టింది. అది ఎంతో సంతోషంగా గద్దకు తన బిడ్డను చూపించింది. అయితే ఓరోజు నక్క ఆహారం తెచ్చుకోవడానికి బయటికి వెళ్లింది. అది అదనుగా చూసుకుని, గద్ద నక్కపిల్లను ఎత్తుకుపోయింది. ఆ పిల్లను చంపేసి తన పిల్లలకు పెట్టి, తనూ తింది.

కాసేపటికి తిరిగి వచ్చిన నక్కకు పిల్ల కనిపించలేదు. గద్దను అడిగితే తనకూ తెలియదంది. కానీ గద్ద చేసిన ద్రోహాన్ని నక్క కనిపెట్టింది. అయినా ఏమీ చేయలేక మౌనంగా రోదించింది.

తర్వాతి రోజు తన గూటికి దగ్గర్లో కొంతమంది వ్యక్తులు ఒక గొర్రెను బలిచ్చి, దాన్ని కాల్చడం కనిపించింది గద్దకు. ఎలాగైనా ఒక ముక్కను ఎత్తుకుపోవాలని అనుకుంది. మెల్లగా వెళ్లి కాస్తంత మాంసాన్ని నోట కరచుకుని పెకై గిరింది. వాళ్లెక్కడ పట్టుకుంటారోనని భయపడి గబగబా గూటికి చేరుకుంది.

అయితే మాంసాన్ని దొంగిలించే ప్రయత్నంలో దాని తోకలోని ఒక ఈకకు అంటుకున్న నిప్పు, ఎండుపుల్లలతో నిర్మించిన గూటికి అంటుకుంది. మంటలకు తాళలేక ఇంకా రెక్కలు రాని గద్దపిల్లలు కింద పడిపోయాయి. అది చూసిన నక్క వాటిని తినేసింది. కళ్లముందే పిల్లలు చనిపోవడం చూసిన గద్ద పెద్దగా ఏడ్చింది. ఆ రోజు తాను నక్కకు ద్రోహం చేయకుండా ఉండివుంటే, ఈరోజు అది తన పిల్లల్ని కాపాడేది కదా అని తనలో తానే కుమిలిపోయింది.

నీతి: నమ్మినవాళ్లను మనం బాధపెడితే, చివరకు మనకూ బాధే మిగులుతుంది.

చీమ-మిడత (Story)

ఒక పొలంలో ఒక చీమ, ఒక మిడత ఉండేవి. చీమ ఎప్పుడూ నెమ్మదిగా నేలమీద పాకుతూ ఏదో ఒక ఆహారం సేకరించుకుని వెళ్లి తన పుట్టలో దాచి పెట్టుకోవడంలో హడావుడిగా ఉండేది.
మిడత మాత్రం హాయిగా, స్వేచ్ఛగా గాలిలో ఎగురుతూ పాటలు పాడుకుంటూ తిరుగుతుండేది. పంటల మీద వాలి, తిన్నంత తిని పాడుచేసినంత పాడు చేసి ఆనందిస్తుండేది.
ఒకరోజు నెమ్మదిగా నేల మీద పాకుతూ తన దేహం కంటే పెద్దదిగా ఉన్న ఒక బియ్యపు గింజను లాగలేక లాక్కుంటూ వెళుతున్న చీమను చూసి మిడత పకపక నవ్వసాగింది.
చీమకు కోపం వచ్చి ‘ఓసి పొగరుబోతు మిడతా! ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నావు?’ అని ప్రశ్నించింది.
అందుకు మిడత ‘‘నిన్ను చూస్తుంటే జాలి వేస్తున్నది. నువ్వెంత, నీ ఆకలి ఎంత? ఎందుకు ఎప్పుడూ ధాన్యం లాక్కువెళ్లి పుట్టలో పెట్టుకుంటూ రోజంతా శ్రమ పడుతుంటావు? నా లాగా హాయిగా పాటలు పాడుకుంటూ తిరగవచ్చు కదా!’ అన్నది.
చీమ ఏమీ సమాధానం చెప్పకుండానే వెళ్లి పోయింది.
కోతలు పూర్తయి పంట అంతా రైతుల ఇళ్లకు వెళ్లిపోయింది.
ఇంతలో భారీ వర్షాలు వచ్చాయి. తోట అంతా వర్షంతో ముద్దముద్ద అయిపోయింది. మిడతకు ఉండటానికి ఇల్లు లేదు. తినడానికి తిండి లేదు.

అప్పుడది చీమ ఇంటికొచ్చి ‘మిత్రమా! వర్షంలో తడిసి పోతున్నాను. ఆకలికి చచ్చిపోతున్నాను. నన్ను కొంతకాలం నీ ఇంట్లో ఉండనివ్వు. నువ్వు దాచుకున్న ఆహారం నాకు కూడా ఇంత పెట్టు’ అన్నది.

చీమ పకపక నవ్వి ‘వర్షాలు వస్తాయని తెలిసే నేను ముందు జాగ్రత్తగా ఆహారం దాచుకున్నాను. ఇప్పుడు వెచ్చగా హాయిగా ఇంట్లో ఉంటున్నాను’ అని చెప్పి లోపలికి వెళ్లిపోయింది.

నీతి: ముందుచూపు అవసరం.

Friday, February 1, 2013

నిజం నిప్పులాంటిది!



రాత్రి భోజనాలు చేసి పిల్లలు వచ్చేసరికి సావిత్రమ్మ బామ్మ ఏదో పుస్తకం చదువుకుంటున్నది. పదేళ్ళ రాంబాబు, ‘‘నిన్న మా బాబాయి ఆయన స్నేహితుడితో, ‘కృష్ణమూర్తి తన తెలివితేటలతో పదిమంది కళ్ళూ కప్పుదామనుకున్నాడు. అయినా నిజం నిప్పులాంటిది కదా? వాడికి తగిన శిక్షే పడింది,' అనడం విన్నాను. నిజం నిప్పులాంటిది అంటే ఏమిటి బామ్మా?'' అని అడిగాడు.
బామ్మ వాణ్ణి ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని, ‘‘కొందరు గోప్యంగా చెడుపనులు చేస్తూ ఉంటారు. అయితే అది ఎప్పుడో ఒకప్పుడు బయట పడే తీరుతుంది. దీన్నే మీ బాబాయి చెప్పాడు. వెనకటికి రామచంద్రం, జోగినాధం అనే వాళ్ళు ఇలాగే ప్రవర్తించారు. వాళ్ళ కథ చెబుతాను వినండి,'' అంటూ ప్రారంభించింది: గిరిపురం జమీందారు మాధవయ్య దివాణానికి ఒకసారి ఒక యువకుడు వచ్చి, ‘‘అయ్యూ నా పేరు విశ్వనాధం.
నా విద్య పరీక్షించి ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే, మీ పేరు చెప్పుకుని బతుకుతాను,'' అన్నాడు. జమీందారు, ‘‘మా దివాణంలో రామచంద్రం, జోగినాధం అని ఇద్దరు పెద్దవాళ్ళు ఏనాటినుంచో పనిచేస్తున్నారు. నువ్వు నెల్లాళ్ళ పాటు వాళ్ళిద్దరి దగ్గరా పనిచెయ్యి. ఆ తర్వాత వాళ్ళు నిన్ను పనిలోకి తీసుకోమంటే, అప్పుడు చూద్దాం,'' అన్నాడు.
తెలివితేటలూ, మాటకారితనమూ కలిగిన విశ్వనాథం ప్రవర్తన, ఆ పెద్దవాళ్ళిద్దరికీ నచ్చింది. ఒక్కొక్క ఆడపిల్లే వున్న ఆ ఇద్దరికీ కూడా, విశ్వనాథాన్ని మంచి చేసుకుని, తమ పిల్లనిచ్చి పెళ్ళి చేద్దామన్న ఆలోచన వచ్చింది. జోగినాధం వీలుదొరికినపుడల్లా విశ్వనాధంతో,‘‘నువ్వా రామచంద్రాన్ని నమ్మకు.
అతడికి జమీందారుకు దొంగ లెక్కలు చెప్పి డబ్బు జేబులో వేసుకునే అలవాటుంది,'' అనేవాడు. ఇక రామచంద్రం విశ్వనాధంతో, ‘‘జోగినాధం చీటికీ మాటికీ ఇంట్లో ఎవరికో ఒకరికి ఏదో రోగం వచ్చిందని కల్లబొల్లి ఏడుపులు ఏడ్చి, జమీందారు దగ్గర డబ్బు గుంజుతూనే ఉంటాడు.

అలాంటి వాడితో జతకట్టావనుకో, నీకూ చెడ్డ పేరు రావడం ఖాయం!'' అంటూ పదే పదే చెబుతూండేవాడు. ఈ పెద్దలు ఒకరిపై ఒకరు చెప్పుకునే చాడీలు వినీవినీ విసిగిపోయిన విశ్వనాధం, వాళ్ళ మాటల్లో వున్న నిజానిజాలు తెలుసుకోవాలనుకున్నాడు. ఆ ఊరి కరణాన్ని కలుసుకుని పెద్దలు చెబుతూన్న మాటలు చెప్పాడు. అంతా విన్న కరణం, ‘‘ఇద్దరికి ఇద్దరూ మోసగాళ్ళే!
 
ఆ రామచంద్రం శ్రీరామనవమి ఉత్సవాలకోసం జమీందారిచ్చిన డబ్బులో చాలా భాగం, సొంతం చేసుకున్నాడు. ఇక జోగినాధం-జమీందారు ధర్మసత్రం ఖర్చులకు ఇచ్చే డబ్బులో సగానికి పైగా స్వాహా చేస్తున్నాడు. ఇదంతా, నాకూ, గ్రామ పెద్దలకూ తెలుసు. అయినా జమీందారుకు వాళ్ళంటే ఎక్కడలేని నమ్మకం. అందుకే ఆయనతో అసలు సంగతి చెప్పలేక పోతున్నాం,'' అన్నాడు.
 
విశ్వనాధం జమీందారును ఏకాంతంలో కలుసుకుని, ఇరవై రోజులుగా రామచంద్రం జోగినాధాల ప్రవర్తన, ఆ ఇద్దరి పట్లా గ్రామ కరణం, పెద్దల అభిప్రాయం ఏమిటో వివరించి, ‘‘తమరు అనుమతిస్తే, వారందరూ ఇప్పుడే వచ్చి దివాణం పెద్దలిద్దరి నిజ స్వరూపమేమిటో, విన్నవించుకోగలరు,'' అన్నాడు. జమీందారు, విశ్వనాధం మాటలకు ఒక్క క్షణం మాటరానట్టు ఉండిపోయి, ‘‘కరణం, ఊరి పెద్దలూ వచ్చి సాక్ష్యం పలకనవసరం లేదు. వాళ్ళ నిజాయితీని నేనెరుగుదును.
 
నిజం నిప్పులాంటిది కదా! ఎన్నాళ్ళని దాచగలరు? ఈ క్షణం నుంచీ రామచంద్రం, జోగినాథాలతో సహా ఉద్యోగులందరి మీదా అధికారిగా నిన్ను నియమిస్తున్నాను,'' అంటూ విశ్వనాథాన్ని మెచ్చుకున్నాడు. కథ ముగించిన బామ్మ, ‘‘మనం చేసే చెడ్డ పనులు ఎంత రహస్యంగా చేసినా ఎప్పుడో ఒకప్పుడు బయట పడక తప్పదు. కాబట్టి మంచి పనులను చేయడమే అలవాటు చేసుకోవాలి. నిజం నిప్పులాంటిది అంటే ఏమిటో ఇప్పుడు తెలిసిందా?'' అన్నది. ‘‘తెలిసింది, బామ్మా,'' అంటూ పిల్లలందరూ ఉత్సాహంగా తలలు ఊపారు.

Mirapakaya Buddodu



æXŸ¿-ªÃP åXŸ¿l-«ÕtÂ¹× ŠÂ¹ ¹ØÅŒÕª½Õ …¢œäC. ‚„çÕ ÍÃ©Ç Æ¢Ÿ¿¢’à …¢œäC. ‹ªîV X¾Ü© Â¢ Æœ¿-NÂË „çRx¢C. ‚„çÕÊÕ ŠÂ¹ ¤Ä«á ÍŒÖ®Ï åX@Çx-œÄ-©-ÊÕ-¹עC. ‚ XÏ©xÊÕ X¾{Õd-éÂRx X¾Û{d©ð ŸÄÍä-®Ï¢C.

'\¢Ÿ¿¦Çs! XÏ©x ƒ¢Âà ªÃ©äŸ¿Õ?Ñ ÆÊÕ-¹×Êo åXŸ¿l«Õt Æœ¿-«¢Åà „çC-ÂË¢C. XÏ©x ¹Ê-¦-œ¿Â¹ „çÂˈ „çÂˈ \œËa¢C. ‚ÂÃ-¬Á¢©ð ‡šð „ç@ÁÙhÊo ¤Äª½yB X¾ª½-„äÕ-¬Áy-ª½Õ©Õ ‚ \œ¿ÕX¾Û NE èÇL X¾œË “X¾ÅŒu-¹~-«Õ-§ŒÖuª½Õ. åXŸ¿l«Õt ’¢Åà NE, 'C’¹Õ-©Õ-X¾-œ¿Â¹× åXŸ¿l«Öt! FÂî ¦Õœ¿f NÕª½-X¾-ÂçŒÕ ƒ²Äh¢. DEo AÊÕ. ¦Õœ¿f NÕª½-X¾-ÂÃ-§ŒÕ-©Ç¢šË ¦Õœîfœ¿Õ X¾Ûœ¿-ÅÜ¿Õ. „ÃœË ÆÂ¹ˆÊÕ „Üä B®¾Õ-Âí-²Ähœ¿ÕÑ ÆE NÕª½-X¾-ÂÃ-§ŒÕÊÕ ƒ*a «Ö§ŒÕ-„çÕi-¤ò-§ŒÖª½Õ.

åXŸ¿l«Õt ƒ¢šËÂË «*a NÕª½-X¾-ÂçŒÕ AÊ-’Ã¯ä „ç¢{¯ä ¦Õœ¿f-NÕ-ª½-X¾-ÂçŒÕ ©Ç¢šË ¦Õœîfœ¿Õ X¾ÛšËd, ֮͌¾Õh¢-œ¿-’ïä åXŸîlœçj 'Æ«Öt! N†¾§ŒÕ¢ \¢šð ÍçX¾Ûp?Ñ Æ¯Ãoœ¿Õ. åXŸ¿l«Õt ÍçXÏp¢C. „ç¢{¯ä „Ü¿Õ Æœ¿-N-©ðÂË „çRx ¹E-XÏ¢-*Ê •¢ÅŒÕ-«Û-Ê©Çx ÆœË-’Ü¿Õ.

'¦ÕœîfœÄ! ¦ÕœîfœÄ! F ÆÂ¹ˆ ‚ X¾Û{d©ð …¢CÑ ÆE ÍçXÏp¢C ŠÂ¹ <«Õ. ¦Õœîfœ¿Õ X¾Û{d-X¾-¹ˆ¯ä ŸÄ¹׈-¯Ãoœ¿Õ. ¤Ä«á ¦§ŒÕ-{Â¹× «*a ÆšÇd ¤ò’ïä, ƒšÇd ©ðX¾-LÂË Ÿ¿ÖªÃœ¿Õ. ÆÂ¹ˆÊÕ B®¾Õ-¹×E ƒ¢šËÂË «Íäa-¬Çœ¿Õ.

¤Ä«á «*a X¾Û{d©ð XÏ©x ¹Ê-¦-œ¿Â¹ ¦Õ®¾Õq-«Õ¢C. åXŸ¿l«Õt ƒ¢šËÂË ¤òªá <¹šË X¾œä-ŸÄ¹ Íëšðx ŸÄ¹׈¢C. Æ¢Ÿ¿ª½Ö E“Ÿ¿-¤ò-§ŒÖ¹ XÏ©xÊÕ ‡ÅŒÕhÂ¹× ¤òªá ¤ÄÅÃ@Á ©ð¹¢©ð ŸÄ*¢C. Åç©ÇxJ åXŸ¿l«Õt ’í©Õx-«Õ¢C. ¦Õœîfœ¿Õ „ç¢{¯ä ¦§ŒÕ-©äl-ªÃœ¿Õ. ¦µ¼Ö©ð-¹-«Õ¢Åà „çCÂË ¤ÄÅÃ-@Ç-EÂË ¤ò§ŒÖœ¿Õ. ¤Ä«á ¹@Áx©ð Âê½¢ ÂíšËd ÆÂ¹ˆÊÕ ÅçÍäa-¬Çœ¿Õ.

Âí¯Ão-@ÁxÂ¹× ¤Ä«á «ÕSx «*a XÏ©xÊÕ B®¾Õ-¹×-¤òªá ¨²ÄJ ‚ÂÃ-¬Á¢©ð ŸÄ*¢C. ‚ÂÃ-¬Á¢©ð ÍŒ¢“Ÿ¿Õœ¿Õ ‚„çÕ Æ¢Ÿ¿¢ ÍŒÖ®Ï «áÍŒa-{-X¾-œÄfœ¿Õ. „ç¢{¯ä åXRx Í䮾Õ-¹×-¯Ãoœ¿Õ. ¤Ä«áÂË ÍŒ¢“Ÿ¿Õ-œËåXj ÂîX¾¢ «*a¢C. ¦Õ®¾©Õ Â휿ÕÅŒÖ «*a ÍŒ¢“Ÿ¿Õ-œËE Nբ꒮ϢC. ÆX¾Ûpœä ÆÂ¹ˆ Â¢ «*aÊ ¦Õœîfœ¿Õ ÆC ͌֬ǜ¿Õ. ŸÄE Åî¹ÊÕ X¾{Õd-¹×E èǜˢ-Íä-®¾-JÂË ÍŒ¢“Ÿ¿Õœ¿Õ ­œË X¾œÄfœ¿Õ. „ç¢{¯ä ¤Ä«áE ¦©¢ ÂíDl N®Ï-êª-¬Çœ¿Õ. ÆX¾p-{Õo¢* ¤Ä«á ¤Ä¹׈¢{Ö ªÃ«œ¿¢, ÍŒ¢“Ÿ¿Õ-œËE NÕ¢’¹œ¿¢, ¦Õœîfœ¿Õ ŸÄE Åî¹ NC-L¢* N®Ï-êª-§ŒÕœ¿¢. ¤Ä«á ÍŒ¢“Ÿ¿Õ-œËE NÕ¢T-Ê-X¾Ûpœä «ÕÊÂË ÍŒ¢“Ÿ¿-“’¹-£¾Çº¢ «®¾Õh¢C. „ç¢{¯ä ¦Õœîfœ¿Õ ÅŒÊ ¦Ç«ÊÕ ÂäÄ-œ¿Õ-¹ע-šÇœ¿Õ. 

Kodi Pillala Upayam - Telugu Story

         ŠÂ¹ ÂîœË …¢œäC. ŠÂ¹-¯Ãœ¿Õ ÆC ’¹Õœ¿Õx åXšËd¢C. ÂíEo ªîV-©Â¹× Æ¢Ÿ¿Õ-©ð¢* ÂîœË XÏ©x©Õ «ÍÃaªá. Æ«Fo ŠÂ¹ ’¹Öšðx „çÍŒa’à X¾œ¿Õ-¹×-¯äN.ÆÊÕ-Âî-¹עœÄ ŠÂ¹ ªîV ÂîœË X¾Â¹ˆ «ÜJÂË „ç@ÇxLq «*a¢C. XÏ©xLo XÏL*, 'èÇ“’¹-ÅŒh’à …¢œ¿¢œË. ‡«-JF X¾ÜJh’à ʫÕt-¹¢œË. ¹L®Ï ¹{Õd’à «Õ®¾Õ-©Õ-ÂËÑ ÆE ÍçXÏp „çRx¢C. ÂîœË „ç@Áx-œÄEo ‹ ʹˆ ֮͌ϢC. ‡©Ç-é’j¯Ã ªÃ“A «*a „ÚËE ‚ª½-T¢-ÍÃ-©-ÊÕ-¹עC. ÆC ÊÂ¹×ˆÅŒÖ ÊÂ¹×ˆÅŒÖ ÂîœË XÏ©x© Ÿ¿’¹_-ª½Â¹× «*a, 'ÂîœË ¹ØÊ©Ö! ¨ ªÃ“AÂË OÕª½Õ ‡Â¹ˆœ¿ X¾œ¿Õ-¹ע-šÇª½Õ?Ñ ÆE ÆœË-T¢C.

'„äÕ«Õ¢Åà «Ö Æ«Õt Íä®ÏÊ ’¹Öšðx¯ä X¾œ¿Õ-¹עšÇ¢Ñ ƯÃo-§ŒÕN «á¹h-¹¢-ª¸½¢Åî. ʹˆ ®¾¢¦-ª½¢’à „çRx-¤ò-ªá¢C.

ÆC „ç@Áx-’ïä ÂîœË-XÏ-©x©Õ ÅŒ«Õ©ð ÅÃ«á «ÖšÇx-œ¿Õ-¹ע{Ö 'Æ«Õt ‡«-JF X¾ÜJh’à ʫÕt-«-Ÿ¿l¢C ¹ŸÄ? ÂæšËd «ÕÊ¢ èÇ“’¹-ÅŒh’à …¢œÄLÑ ÆÊÕ-¹×-¯Ãoªá. ‚ ªÃ“A ÆN ÅŒ«Õ ’¹Öšðx «á@ÁÙx X¾œä®Ï ¦§ŒÕ-{ÂË «Íäa®Ï ¤ñªáu©ð X¾œ¿Õ-¹×-¯Ãoªá. ªÃ“A ®¾Ÿ¿Õl-«Õ-ºË-’ù ʹˆ ¯ç«Õt-C’à «*a ’¹ÖšðxÂË „ç᣾Ǣ åXšËd¢C. ŸÄE «âA E¢œÄ «á@ÁÙx ’¹ÕÍŒÕa-¹×-¯Ãoªá. ÆC «â©Õ-’¹ÕÅŒÖ Æœ¿-N-©ðÂË ¤ÄJ-¤ò-ªá¢C.

«ÕªÃoœ¿Õ ʹˆ «ÕSx «*a, 'ÂîœË ¹ØÊ©Ö! ƒ„Ã@Á ªÃ“A ‡Â¹ˆœ¿ X¾œ¿Õ-¹ע-šÇª½Õ?Ñ ÆE ÆœË-T¢C.

'Æ«Õt Íä®ÏÊ ¤ñªáu©ð X¾œ¿Õ-¹עšÇ¢Ñ ƯÃoªá. ʹˆ ®¾¢’¹A ÅçL-®ÏÊ ÆN ¤ñªáu©ð ¦ï’¹Õ_©Õ X¾œä®Ï ’¹œËf-„Ã-«á©ð X¾œ¿Õ-¹×-¯Ãoªá. ªÃ“A ʹˆ «*a ¤ñªáu©ð «âA åX˜äd-®¾-JÂË EX¾Ûp©Õ ÅŒTL «âA «ÖœË-¤ò-ªá¢C.

X¾{Õd-«-Ÿ¿-©E ʹˆ «ÕªÃoœ¿Õ …Ÿ¿§ŒÕ¢ «*a, 'ƒ„Ã@Á ‡Â¹ˆœ¿ X¾œ¿Õ-¹ע-šÇ-ª½“ªÃÑ ÆE ÆœË-T¢C.

'ÆC’î ‚ ’¹œËf-„Ã-«á©ðÑ Æ¯Ãoªá ÂîœË XÏ©x©Õ. ʹˆ „ç@Áx-’ïä ÂîœË-XÏ-©x©Õ, 'DE «âA OÕŸ¿ «á@ÁÙx ’¹ÕÍŒÕa-¹×Êo «ÕÍŒa©Õ, ÂÃLÊ ’çŒÖ©Õ …¯Ãoªá. ƒC «ÕÊE A¢œÄ-Eê «²òh¢C. ƒ„Ã@Á ‡©Ç-é’j¯Ã DE XÔœ¿ «C-L¢-ÍŒÕ-¹עŸÄ¢Ñ ÆÊÕ-¹×E ¹L-®Ï-¹-{Õd’à ‚©ð-*¢* …¤Ä§ŒÕ¢ X¾¯Ãoªá.

ªÃ“A Æ«Fo Æ{¹ OÕŸ¿ÂË ‡Âˈ ʹˆ Â¢ ‡Ÿ¿Õª½Õ ͌֜¿-²Ä-’êá. ʹˆ «*a ’¹œËf-„Ã-«á©ð Ÿ¿ÖJ¢C. „ç¢{¯ä ÂîœË-XÏ-©x©Õ ’¹œËf-„Ã-«áÂ¹× EX¾Ûp Æ¢šË¢-Íêá. ‚ «Õ¢{©ðx ʹˆ «Ö-œË «Õå®j-¤ò-ªá¢C. ÅŒLx ÂîœË ªÃ’ïä XÏ©x©Õ ƒŸ¿¢Åà Íç¤Äpªá. ÆC ‚Ê¢-Ÿ¿¢’à „ÚËE ÅŒÊ éªÂ¹ˆ©ðx ¤ñŸ¿Õ-«Û¹×E, 'ƒ¢éÂ-X¾Ûpœ¿Ö NÕ«ÕtLo «CL „ç@Áx¯ä¢?Ñ Æ¢C. ÂîœË XÏ©x©Fo ‚Ê¢-Ÿ¿¢’à ÂËÍŒ-ÂË-ÍŒ-©Ç-œÄªá.

ఏనుగు బొమ్మ - కథ

ఒక ఊరిలో అమృత అనే అమ్మాయి ఉండేది. ఆమె బడికి వెళ్ళే మార్గంలో ఒక చింతచెట్టు ఉంది. దాని కింద కొయ్య బొమ్మలు చేసే ఒక తాత ఉండేవాడు. ఆయన ప్రొద్దున నుండి సాయంత్రం చీకటి పడే వరకు ఎంతో దీక్షగా కొయ్యను చెక్కుతూ రకరకాల జంతువుల బొమ్మలను తయారు చేసేవాడు. అమృత వస్తూ పోతూ కాసేపు అక్కడ ఆగేది. ఆయన చేతిలో రూపు దిద్దుకుంటున్న బొమ్మను ఆసక్తిగా చూసేది.

ఒకరోజు అమృత ఆయనతో ‘‘తాతా నాకో బొమ్మ కావాలి?’’ అని అడిగింది.
‘‘ఏ బొమ్మ కావాలి తల్లీ’’ అని ఆయన అడిగాడు.
తాత దగ్గరున్న బొమ్మల్ని పరికించి చూసింది అమృత. అక్కడ రకరకాల బొమ్మలు ఉన్నాయి. వాటిలో జిరాఫీ, కోతి, పులి, కుందేలు బొమ్మలు చాలా అందంగా ఉన్నాయి. ‘‘నీ దగ్గర ఏనుగు బొమ్మ లేదు. ఒక ఏనుగు బొమ్మ తయారు చేసి పెట్టగలవా?’’ అని అడిగింది.
‘‘తప్పకుండా. మరి దాని ధర యాభై రూపాయలు అవుతుంది. నీ దగ్గర అంత డబ్బు ఉందా?’’ ఆన్నాడాయన.

‘‘కొంత ఉంది తాతయ్యా. మిగిలిన డబ్బును నువ్వు బొమ్మ చేసేలోపుగా కూడబెడతాను’’ అని చెప్పింది అమృత. ఇక ఆరోజు నుండి తండ్రి తన అవసరం కోసం ఇచ్చిన రూపాయి, రెండు రూపాయలను దాచసాగింది. ప్రతిరోజూ బొమ్మలు చేసే తాత దగ్గరకు వెళ్ళి తన బొమ్మ గురించి ఆరా తీసేది. తాత ‘అయిపోవచ్చింది’ అంటూ సమాధానం చెప్పేవాడు. కొన్ని రోజుల తరువాత అమృత దగ్గర యాభై రూపాయలు పోగయ్యాయి. ఆ రోజు అమృత స్కూల్ నుండి ఇంటికి వెళ్ళే సమయంలో తాత ఒక ఏనుగు బొమ్మ పట్టుకుని ఆమె కోసం ఎదురుచూడసాగాడు. అమృత దగ్గరకు రాగానే ‘‘ఇదుగో పాపా, నువ్వు అడిగిన ఏనుగు బొమ్మ’’ అని చూపించాడు.

అమృతకు ఎంతో సంబరం కలిగింది. ఆ ఏనుగును ఆప్యాయంగా చేత్తో తడిమి చూసింది. ‘‘డబ్బు తెచ్చి రేపు తీసుకెళ్తాను తాతా’’ అని చెప్పి ఇంటికి వచ్చేసింది అమృత.
ఆ మరునాడు తాత దగ్గరక వెళ్ళిన అమృత. ‘‘తాతా ఆ బొమ్మను నేను తీసుకోలేను. ఇంకెవరికైనా అమ్మేసుకోగలవా?’’ అని అడిగింది.

‘‘ఏమైంది డబ్బులున్నాయన్నావుగా?’’ అని అడిగాడు తాత.
‘‘అవును తాతా కూడబెట్టాను. కానీ నా స్నేహితురాలు పంకజ స్కూల్ ఫీజు కట్టలేదట. వాళ్ళు చాలా బీదవాళ్లు. ఫీజు కట్టడం లేదని మాస్టార్లు స్కూల్‌కి రావద్దన్నారట. రాత్రి మా ఇంటికి వచ్చి ఏడ్చింది. నేను ఆ డబ్బును పంకజకు ఇవ్వాలనుకుంటున్నా’’ అంది అమృత.
తాత ఆ చిన్నమ్మాయిలో ఉన్న పెద్ద మనసుకు ఆశ్చర్యపోయాడు. ‘‘మరి నీకు ఏనుగు బొమ్మ వద్దా?’’ అన్నాడు తాత.

‘‘వద్దులే తాతా. మళ్లీ ఇంకెప్పుడైనా కొనుక్కుంటాను’’ అని వెళ్ళబోయింది అమృత.
‘‘మీ తాతయ్య నీకు ఈ బొమ్మను బహుమతిగా ఇస్తున్నాడు. తీసుకో తల్లీ’’ అంటూ మొహమాట పడ్తున్న అమృత చేతిలో బలవంతగా ఏనుగు బొమ్మను ఉంచాడు తాత.

Tuesday, January 29, 2013

నిరుపయోగమైన విద్య

ఒక ఊళ్లో నలుగురు స్నేహితులు ఉండేవారు. వాళ్లు ఒక ముని దగ్గరకు వెళ్లి, ఎవ్వరికీ నేర్పని విద్య ఏదైనా నేర్పమని కోరారు. అయితే అటువంటి విద్యలతో ఇబ్బందే తప్ప ఉపయోగం ఉండదని ఆ ముని చెప్పాడు. అయిన్పటికీ నేర్పమని పట్టుపట్టారు ఆ నలుగురు. తప్పేది లేక ముని ఆ నలుగురికీ నాలుగు ప్రత్యేక విద్యలను నేర్పాడు. వారు ఆ విద్యలను నేర్చుకుని, తమ ఊరికి ప్రయాణమయ్యారు.

ఒక అడవిగుండా ప్రయాణిస్తూండగా మార్గమధ్యంలో వాళ్లకి కొన్ని ఎముకలు కనిపించాయి. అవి చూడగానే ఆ నలుగురికీ తమ తమ విద్యలను ప్రదర్శించే అవకాశం దొరికిందనుకుని సంతోషం కలిగింది.

మొదటివాడు ఎముకల వాసన చూసి ‘ఇవి సింహం ఎముకలు’ అన్నాడు.
రెండవవాడు ‘నేను నా విద్యతో వీటన్నిటినీ కలిపి అస్థిపంజరం చేస్తాను’ అని అలాగే చేశాడు.
మూడవవాడు, ‘నా విద్యతో ఈ అస్థిపంజరంపై మాంసాన్ని, చర్మాన్ని తెస్తాను’ అని, మంత్రం చదివి, సింహాన్ని తయారుచేశాడు.

నాలుగవ వాడు ‘ఇప్పుడు నా విద్యను ప్రదర్శిస్తాను చూడండి’ అని మంత్రం చదివి ఆ సింహానికి ప్రాణం పోశాడు. దానికి ప్రాణం వచ్చింది.

వెంటనే సింహం లేచి కూర్చుంది. ఆ నలుగురు తమ తమ విద్యలు విజయవంతమైనందుకు సంతోషించారు. ఇంత మంచి విద్యలని ఇంతకాలం నేర్చుకోకుండా ఉన్నందుకు బాధపడ్డారు. ‘ఇక బయలుదేరదాం’ అనుకుంటూ ఉండగా వాళ్లు ప్రాణం పోసిన సింహం మీదకు దూకడానికి సిద్ధమయ్యింది.

ఎదురుగా ఉన్న నలుగురినీ చూసింది. తమ వల్ల ప్రాణం పోసుకున్న సింహం తమనేమీ చేయదనుకున్నారు నలుగురు స్నేహితులు. కానీ, ఆ సింహం అమాంతం వాళ్లని చంపి, తినేసి తన దారిన తాను వెళ్లిపోయింది.పెద్దల మాట వినాలి. లేకపోతే ఈ నలుగురు స్నేహితులకి జరిగినట్టే నష్టం వాటిల్లుతుంది.

సమయస్ఫూర్తి

              ఒక రాజ్యంలో ఒక ముని ఉండేవాడు. అతడు సర్వజ్ఞాని. జోతిష్యం కూడా బాగా చెప్పేవాడు. అతను చెప్పినవన్నీ నిజం అవుతుండడంతో ఆ రాజ్యంలోని వారందరికీ అతనిపై నమ్మకం కుదిరింది.

అతని ప్రతిభ ఆ నోట ఈ నోట ఆ దేశపు రాజు వరకు పాకింది. ఆ ముని ప్రతిభ ఏమిటో స్వయంగా తెలుసుకుందామనిపించింది రాజుకు. అంతే! వెంటనే తన సైనికులను పంపించి,
ఆ ముని ఎక్కడ ఉన్నా వెదికి తన ముందు ప్రవేశపెట్టమన్నాడు.

రాజాజ్ఞ ప్రకారం బయలుదేరి, ఊళ్లన్నీ వెతుకుతూపోయారు. చిట్టచివరకు ఒకానొక ఊరిలో ముని దొరికాడు. అతనికి రాజాజ్ఞను తెలిపి, తమతో రమ్మన్నారు సైనికులు.

ముందు తటపటాయించినా, రాజాజ్ఞ మీరకూడదని సైనికుల వెంట రాజు దగ్గరికి పయనమయ్యాడు ఆ ముని. రాజు మునిని సగౌరవంగా ఆహ్వానించి, సకల మర్యాదలు చేశాడు. అన్నీ పూర్తయ్యాక,
రాజు ‘‘మునివర్యా! మీ జ్యోతిష్య ప్రతిభ గురించి చాలా విన్నాం. ఇప్పుడు మా భవిష్యత్తు చెప్పాలి’’ అన్నాడు.

ముని ఒక్కక్షణం ఆలోచించి, రాజుగారి భవిష్యత్తు చెప్పడం ప్రారంభించాడు. తన గురించి గొప్పగా చెబుతుంటే రాజు పొంగిపోయి కానుకల మీద కానుకలు కురిపించాడు. కొంతసేపటికి ముని రాజుకు జరగబోయే చెడు చెప్పడం మొదలుపెట్టాడు.

వెంటనే రాజుకు కోపం వచ్చింది, ఆ మునికి ఉరిశిక్ష వేయాలన్నంత ఆవేశం వచ్చింది. ‘తన భవిష్యత్తు ఇంత భయంకరంగా చెబుతాడా?’ అనుకుని, ‘‘నువ్వు తప్పుడు జ్యోతిష్యం చెబుతున్నావు. నీకు నిజంగా జ్యోతిష్యం వస్తే నువ్వెప్పుడు చనిపోతావో చెప్పు’’ అని అడిగాడు.
మునికి రాజు కోపం అర్థమైంది. తనకు రాబోయే అపాయాన్ని కూడా ఊహించాడు. సమయస్ఫూర్తితో నెమ్మదిగా ‘‘మీరు చనిపోయే గంట ముందు నేను చనిపోతాను ప్రభూ’’ అన్నాడు.
ఆ మాటతో రాజుకి కోపం చల్లారిపోయింది. తన తప్పును తెలుసుకుని మునిని గౌరవించి సాగనంపాడు.

కాకి లెక్కలు

ఒకరోజు ఉదయం బీర్బల్ రాజదర్బారుకు వెళ్లేసరికి అందరి ముఖాలూ దిగాలుగా కనిపించాయి. అక్బరు చక్రవర్తి వాళ్లని ఏదో ప్రశ్న అడిగి ఉంటాడనీ, దానికి వాళ్లు సమాధానం చెప్పలేకపోయి ఉంటారనీ అర్థమయ్యింది బీర్బల్‌కి.

అతను నెమ్మదిగా చక్రవర్తి దగ్గరకు వెళ్లి, ‘‘విషయం ఏమిటి జహాపనా?’’ అని అడిగాడు.

‘‘మన రాజ్యంలో విషయాలేవీ మన మంత్రులకి పట్టడం లేదు. ఇలా అయితే మన రాజ్యం నడపలేం’’ అన్నాడు కోపంగా.

‘‘అసలు సంగతేంటి జహాపనా?’’ అని అడిగాడు బీర్బల్.

‘‘మన రాజ్యంలో మొత్తం కాకులెన్ని ఉన్నాయో అని వీళ్లని అడిగితే ముఖాలు వేళ్లాడేసుకుని తెలియదు అంటున్నారు’’ అన్నాడు చక్రవర్తి.

‘‘ఓస్ అంతేనా!’’ అన్నాడు బీర్బల్.

‘‘నీకు తెలుసా?’’ అడిగాడు చక్రవర్తి.

‘‘ఓ! మన రాజ్యంలో మొత్తం నాలుగు లక్షల ఎనభై రెండు వేల నలభై ఆరు కాకులున్నాయి. కావాలంటే లెక్క పెట్టించండి’’ చెప్పాడు బీర్బల్.

‘‘అంత కచ్చితంగా ఎలా చెప్పగలవు? ఒకవేళ అంతకంటే ఎక్కువ ఉంటే?’’ అడిగాడు చక్రవర్తి.
మన రాజ్యంలో ఉన్న చుట్టాలని చూడటానికి పక్క రాజ్యాల నుంచి కొన్ని కాకులు వచ్చి ఉంటాయి ప్రభూ!’’

‘‘అలాగా! మరి తక్కువ ఉంటే?’’

‘‘ఉండొచ్చు ప్రభూ! మన కాకులు వాళ్ల చుట్టాలని చూడటానికి పక్క రాజ్యాలకు వెళ్లి ఉండొచ్చు కదా?’’ అన్నాడు బీర్బల్.

ఈ కాకి లెక్కలకు అక్బరు హాయిగా నవ్వుకున్నాడు.

Monday, January 28, 2013

తగినశాస్తి

కపిలాపురంలో గోపాలం, గోవిందం అనే ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. గోపాలానికి ధనాశ ఎక్కువ. అతను ఒకసారి గోవిందం దగ్గర పెద్దమొత్తంలో ధనం అప్పుగా తీసుకున్నాడు. ఆ తర్వాత ఎన్నిసార్లు అడిగినా గోపాలం అతనికి డబ్బు తిరిగి ఇవ్వకపోగా గోవిందం వెళ్లిన ప్రతిసారీ ఏవో అబద్ధాలు కల్పించి చెప్పసాగాడు. ఒకనాడు గోవిందం గోపాలం ఇంటికి వెళ్లి ‘‘నా అప్పు ఎప్పుడు తీరుస్తావు?’’ అని గట్టిగా నిలదీయడంతో గోపాలం కిందపడి గిలగిల కొట్టుకుం టూ అనారోగ్యం ఉన్నట్టు అభినయించసాగాడు.

అంతలో అతని భార్య లోపలి నుంచి వచ్చి ‘‘అయ్యో! అయ్యో! అనారోగ్యంతో బాధపడుతున్న నా భర్తను డబ్బు కోసం పీడిస్తావా?’’ అంటూ శాపనార్థాలు పెట్టసాగింది.
గోవిందం ఇవతలికి రాగానే భార్యభర్తలిద్దరూ ‘బాగా కుదిరింది. ఇక నుంచి గోవిందం ఎప్పుడు వచ్చినా ఇలాగే చేయాలి’ అనుకోవడం అతని చెవినపడింది.

గోవిందం కొంతకాలం తర్వాత మళ్లీ వెళ్లి డబ్బు అడగబోగా, గోపాలం ఈసారి కూడా కిందపడి గిలగిల కొట్టుకోసాగాడు. అతని భార్య గోవిందాన్ని తిట్టడం మొదలుపెట్టింది.
వీళ్ల నాటకాన్ని ఎలాగైనా బయటపెట్టాలనుకున్న గోవిందం ఈ విషయం మొత్తం గ్రామాధికారికి ఫిర్యాదు చేశాడు.

గ్రామాధికారి ఒక ఉపాయం ఆలోచించాడు. ఆ ప్రకారం గోవిందం కొద్దిరోజుల తర్వాత మళ్లీ గోపాలం ఇంటికి వెళ్లి ‘‘నా అప్పు ఎప్పుడు తీరుస్తావు’’ అని అడగటంతో గోపాలం కిందపడి గిలగిల కొట్టుకోసాగాడు.

అప్పుడే లోపలికి వచ్చిన గ్రామాధికారి తన వెంట వచ్చిన గ్రామవైద్యుడికి సైగ చేయడంతో వైద్యుడు గోపాలం నాడిని పరీక్షించి, ‘‘అయ్యా! ఇతని పరిస్థితి ఆఖరి దశలో ఉంది. ఏవైనా ముఖ్యమైన పనులు వుంటే పూర్తి చేయడం మంచిది’’ అన్నాడు.

అంతట గ్రామాధికారి గోపాలం ఇల్లు అతని తదనంతరం అతని భార్యకు చెందాలి. భోషాణం పెట్టెలోని డబ్బు గోవిందం ఇచ్చిన అప్పుకు వడ్డీతో సహా చెల్లించాలి’’ అన్నాడు. గోపాలానికి తగిన శాస్తి జరిగిందని అందరూ సంతోషించారు.