Tuesday, February 5, 2013

సముద్రాలు తీరాలను తినేస్తాయా?

భూవాతావరణం వేడెక్కడం వల్ల కిలోమీటర్ల మేర తీర ప్రాంతం సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది. దాంతో సముద్రం ఇసుక తిన్నెలను తనలో కలిపేసుకుంటూ మరింత ముందుకు వచ్చేస్తుంటుంది. ఇది పర్యావరణ నిపుణులను సామాన్య ప్రజానీకాన్ని కూడా ఎంతో ఆందోళనకు గురిచేస్తోంది. సముద్రతీరం కోతకు గురై మట్టంలో వచ్చే తేడావల్ల క్రమంగా కొన్ని తీరాలే కనుమరుగవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఇలా మునిగిపోయిన మూడు సముద్ర తీర ప్రాంతాలు ఒరిస్సా, విశాఖపట్నం తీరాల మధ్య ఉన్నట్టుగా గుర్తించారు. విశాఖపట్నం వద్ద తీరం గతంలో కంటే 25 కిలోమీటర్లు కోల్పోయిందని అంటున్నారు. ఎకోసౌండర్, సిస్మిక్ పరికరాలతో చేట్టిన సర్వేలో వారు ఈ సంగతి గుర్తించారు. ఈ తీరాల వెంట కొన్ని నదీపాయలు కూడా ఉన్నట్టు వారి పరిశోధనలలో తేలింది. అంటే నదులు కూడా సాగరగర్భంలో అంతరించిపోతున్నాయని గ్రహించాలి.

0 comments:

Post a Comment