Friday, February 1, 2013

వేణువు - సంగీత వాద్యం

ఇది కర్ణాటక సంగీత వాద్యపరికరం. దీన్నే పిల్లన గ్రోవి అని కూడా పిలుస్తారు. అత్యంత నాణ్యత కలిగి, బాగా ఆరబెట్టిన వెదురుముక్కతో తయారు చేసిన రంధ్రాలు గల వాద్యపరికరం.

ఈ వెదురు గొట్టాన్ని ఒక వైపు తెరచి మరొక వైపు మూసి ఉంచుతారు. పై భాగాన గాలి ఊదేందుకు రంధ్రం ఉంటుంది.
ఈ ర్రంధంతోపాటు స్వరాల మార్పుకోసం మరికొన్ని రంధ్రాలు ఉంటాయి. యూరప్‌లో ఈ సంప్రదాయ సంగీత వాద్యం ఎంతో ప్రాచీన కాలం నాటి నుంచే ఉండేదని కొందరి అభిప్రాయం.

చైనాలో క్రీ.పూ.433లో ఝవూ రాజవంశీకుల కాలంలో వాయించేవారు. దీనిని వారు షి జింగ్ అని పిలిచేవారు. ఇక భారత సంప్రదాయానికి వస్తే పిల్లనగ్రోవి శ్రీకృష్ణుడినే తలపిస్తుంది.
మన దేశంలోని వాటికి, పశ్చిమదేశాలలోని వాటికి తేడా ఉంది.ఆధునిక కాలంలో పండిట్ రఘునాథ్ ప్రసన్న, పండిట్ రాజేంద్ర ప్రసన్న, పండిట్ హరిప్రసాద్ చౌరాసియాలు పిల్లనగ్రోవిని మరింత ప్రాచుర్యం చేసిన ప్రముఖులు.

0 comments:

Post a Comment